Khammam District: దేశంలోని పౌరులందరికీ రాజ్యాంగ విద్యను అందించాలని సీపీఎం రాజకీయ విద్యా విభాగం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పల్లా కొండలరావు(Palla Kondala Rao) పిలుపునిచ్చారు. బోనకల్లోని సీపీఎం కార్యాలయంలో “రాజ్యాంగ అధ్యయనం” అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. స్టడీ సర్కిల్ కన్వీనర్ తెల్లాకుల శ్రీనివాసరావు(Srinivasa Rao) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పల్లా కొండలరావు మాట్లాడుతూ.. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో రాజ్యాంగం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read:Hyderabad Rains: ప్రజలకు ఎలాంటి కష్టం రానివ్వద్దు.. రౌండ్ ద క్లాక్ అలెర్ట్గా ఉండాలి
ప్రజాస్వామ్యాన్ని పపరిరక్షించాలి
రాజ్యాంగ విద్యను ప్రజలకు బోధించడం అంటే, వారిని చైతన్యవంతులను చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సెమినార్లో జొన్నలగడ్డ సునీత, బంధం శ్రీనివాసరావు,(Srinivasa Rao బూర్గుల అప్పాచారి, పీవీ అప్పారావు, కుక్కల కోటేశ్వరరావు, గుగులోతు నరేశ్, చలమల హరికిషన్ రావు, బొప్పాల రమేశ్, కూచిపూడి మురళీ, కంసాని సూర్యప్రకాశరావు, బత్తినేని రాంబాబు, ఏసుపోగు బాబు, దొండపాటి సత్యనారాయణ, బోయినపల్లి వీరబాబు, చేపూరి వెంకటేశ్వర్లు, నోముల పుల్లయ్య, బోయినపల్లి కొండ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jr NTR: సీఎం రేవంత్కు థ్యాంక్స్ చెప్పడం మరిచిపోయిన ఎన్టీఆర్.. ఏం చేశాడంటే?
