Raksha Bandhan (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Raksha Bandhan: గద్వాల జిల్లాలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

Raksha Bandhan: అనురాగం అనుబంధం ఆత్మవిశ్వాసం.. అన్నీ సమపాళ్లలో కలిసిన బంధమే రక్తసంబంధం, ఎల్లలు లేని ప్రేమకు, వెలకట్టలేని విలువలకు ఇది ఓ చిహ్నం. కలిసిమెలిసి పెరిగినా అల్లరి చేస్తూ గడిపినా.. కష్టాల్లో తోడుగా నిలిచినా సోదర సోదరీమణుల ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో రక్షాబంధన్ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకలకు సుదూర ప్రాంతాల్లో ఉన్న అక్క చెల్లెళ్లు అన్నదమ్ములను కలిసి రాఖీలు కట్టారు. జిల్లాలో పవిత్రమైన రక్షాబంధ‌న్ సందర్భంగా సోదరుల ఇళ్ళకు సోదరీమణులు రాకతో పండగ వాతావరణం నెలకొంది.

సీఎం రేవంత్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ(ZP) చైర్ పర్సన్ సరిత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రి పొన్నం ప్రభాకర్‌(Min Ponnam Prabhakar)కు రాఖి పౌర్ణమి పురస్కరించుకొని వారికి రాఖీ కట్టారు. ప్రతి మహిళ జీవితాలలో సుఖసంతోషాలు వెల్లువిరియాలని, ఆరోగ్యవంతమైన జీవితాలను పొందాలని సీఎం(CM) ఆకాంక్షించారు.

Also Read: Parks in Khammam: ఖమ్మం జిల్లాలో రెండు కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు ప్రతిపాదన

ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLa Krishna Mohan Reddy)కి ఆయన సోదరి, బ్రహ్మ కుమారీస్ పలువురు మహిళలు రాఖీలు కట్టగా, ఆయన సతీమణి బండ్ల జ్యోతి(Bandla Jyoti) నాయకులు రమేష్ నాయుడు, గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, తదితరులకు రాఖీ కట్టారు. అదేవిధంగా బిఆర్ఎస్(BRS) జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు కు ఆయన నివాసంలో మోనేష్ కుటుంబ సభ్యులతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ ఆయన సోదరీమణులు రాఖీలు కట్టి కలకాలం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు.

Also Read: Huma Qureshi Cousin: పార్కింగ్ లొల్లి.. స్టార్ నటి కజిన్ దారుణ హత్య.. ఇలా ఉన్నారేంట్రా..!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్