Online Betting: ఆన్ లైన్ బెట్టింగు(Online Betting)ల్లో అప్పుల పాలైన పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం వనస్థలిపురం పోలీస్ స్టేషన్( Vanasthalipuram Police Station)పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగర్ జిల్లాకు చెంది ప్రస్తుతం వనస్థలిపురంలో నివాసముంటున్న నరేశ్ పోస్టల్ శాఖ ఉద్యోగి.
Also Read: Urea Supply: లోటు యూరియాను ఆగస్టు నెలతో కలిసి సరఫరాచేయాలి.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొంతకాలంగా నరేశ్(Naresh) ఆన్ లైన్ బెట్టింగులగు(Online Betting)కు అలవాటు పడ్డాడు. డబ్బు పోతున్నా దాని నుంచి బయట పడలేక పోయాడు. ఈ క్రమంలో తెలిసిన వారి నుంచి దాదాపు 15లక్షల రూపాయల అప్పులు చేశాడు. ఇక, అప్పు ఇచ్చిన వాళ్లు ఇటీవలిగా బాకీ తీర్చాలని ఒత్తిడి చేస్తుండటంతో తీవ్ర మానసిక ఒత్తడికి గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం కానరాక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వనస్థలిపురం పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Vasavi Construction Company: కూకట్ పల్లి పోలీసులకు.. ఇరిగేషన్ ఆఫీసర్ల ఫిర్యాదు
