E Visitor passes: తెలంగాణ సచివాలయం(Telangana Secretariat)లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, సందర్శకుల సమాచారాన్ని డిజిటలైజ్ చేయడానికి అధికారులు ఈ-విజిటర్ పాస్(E Visitor pass) విధానాన్ని ప్రవేశపెట్టారు. నుంచి ఈ విధానాన్ని ట్రయల్ బేసిస్లో అమలు చేస్తున్నారు. ఈ-విజిటర్ పాస్(E Visitor pass)లు పొందిన సందర్శకులు స్కాన్ చేసి సచివాలయం(Secretariat)లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
Also Read: Ponnam Prabhakar: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ-విజిటర్ పాస్ సిస్టమ్
దీనివల్ల సందర్శకుల డేటా మొత్తం ఆన్లైన్లో నమోదవుతుంది, ఎవరు ఎప్పుడు వచ్చారు అనే వివరాలు స్పష్టంగా రికార్డవుతాయి. ఈ విధానం వల్ల సచివాలయం(Secretariat)లో భద్రత, పారదర్శకత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాస్ విధానంలో సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. త్వరలోనే అన్ని గేట్ల వద్ద ఈ-విజిటర్ పాస్(E Visitor pass) సిస్టమ్ను పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
