Bike Robbery (imagcredit:swetcha)
క్రైమ్

Bike Robbery: వాటికి బానిసై.. బైక్ దొంగలుగా మారిన యువకులు

Bike Robbery: డ్రగ్స్ మద్యానికి బానిసైన నలుగురు యువకులు బైక్ దొంగలుగా మారారు. వీరిలో ఇద్దురు బైక్​మెకానిక్(Bike Mechanic)​లు కావడంతో ఇండ్ల ముందు, రద్దీ ప్రదేశాల్లో పార్కింగ్​చేసిన బైకులను దొంగలిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. బైకు దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠాను మియాపూర్ పోలీసులు(Miyapur Police) అరెస్ట్​చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన 13 బైకులతో పాటు 406 సెంట్రింగ్​బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను మాదాపూర్​జోన్​ఏడీసీపీ ఉదయ్​కుమార్​రెడ్డి(Uday Kumar), మియాపూర్​ఏసీపీ శ్రీనివాస్​కుమార్(Srinivass Kumar)​తో కలిసి మియాపూర్​పోలీస్​స్టేషన్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

మద్యానికి, డ్రగ్స్‌కు బానిసై…

కొల్లూరు డబుల్ బెడ్రూంలో నివాసం ఉండే శ్రీకాంత్​(24), మియాపూర్​గోకుల్ ప్లాట్స్‌లో ఉండే వెంకటేశ్వర్లు(23), వేణు(20), అఖిల్​రెడ్డి(23) నలుగురు స్నేహితులు. వీరిలో శ్రీకాంత్​, వెంకటేశ్వర్లు బైక్​మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. వేణు లేబర్ పని చేస్తుండగా, అఖిల్​రెడ్డి ఓ ప్రముఖ యూనివర్సిటీలో బిటెక్​మధ్యలోనే అపేసి ఖాళీగా ఉంటున్నాడు. నలుగురు మద్యానికి బానిసయ్యారు. దీనికితోడు వెంకటేశ్వర్లుకి గంజాయి తాగే ఆలవాటు ఉంది. పనిచేస్తుండగా వచ్చే డబ్బులు జల్సాలు చేసేందుకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని డిసైడ్​ అయ్యారు.

బైకుల హ్యాండిల్లను విరగొట్టి

శ్రీకాంత్, వెంకటేశ్వర్లు ఇద్దరు బైక్​ మెకానిక్‌లు కావడంతో నలుగురు కలిసి ఇండ్ల ముందు, పార్కింగ్​ప్రదేశాల్లో పార్కింగ్​చేసిన బైకుల(Bike)ను దొంగలించాలని నిర్ణయించుకున్నారు. పార్కింగ్​ప్రదేశాలు, ఇండ్ల ముందు పార్కింగ్​ చేసిన బైకుల హ్యాండిల్లను విరగొట్టి బైకులను దొంగలిస్తారు. దొంగలించిన బైకులను ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)​కు తరలించి అక్కడ రూ. 15వేల నుండి 20వేల వరకు అమ్మేస్తారు. కొన్ని బైకులను పార్టు పార్టులుగా విడదీసి కేజీ రూ. 30 చొప్పున అమ్మేసి వచ్చిన డబ్బులను జల్సాలకు ఖర్చు చేస్తున్నారు.

Also Read: Rowdy-Sheeters: హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్ల పేర దండిగా వసూల్లు!

సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

ఈ నెల 10వ తేదిన మియాపూర్​ఆర్టీసీ కాలనీ(Miyapur RTC Colony) కి చెందిన ఓ వ్యక్తి తన రాయల్​ఎన్​ఫైల్డ్​బైక్​ను రాత్రి 10 గంటలకు తన ఇంటి ముందు పార్కింగ్​చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి బయటకు వచ్చిన యజమానికి ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైక్​కనిపించలేదు. దీంతో మియాపూర్​పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. బైక్​ దొంగతనానికి పాల్పడ్డ శ్రీకాంత్​, వెంకటేశ్వర్లు, వేణు, అఖిల్​రెడ్డిలను అరెస్ట్​చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.30 లక్షల విలువైన13 బైకులు, 406 సెంట్రింగ్​ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

కమిషనరేట్ల పరిధిలో బైకు దొంగతనాలు

కాగా బైకు దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో ఇద్దరు పాతనేరస్థులుగా ఉన్నారు. బైక్​మెకానిక్‌లుగా పనిచేస్తున్న శ్రీకాంత్​పై హైదరాబాద్(Hyderabad)​, సైబరాబాద్​కమిషనరేట్ల పరిధిలో బైకు దొంగతనాల కేసు ఉన్నాయి. కేపిహెచ్​బీ పోలీస్​స్టేషన్​లిమిట్స్(KPHP Police Station)​లో బైక్​దొంగతనం కేసులో అరెస్ట్​అయ్యాడు. మరో నిందితుడు వెంకటేశ్వర్లు మియాపూర్​పోలీస్​స్టేషన్​పరిధిలో గంజాయి కేసులో అరెస్ట్​అయ్యి జైలుకు వెళ్లివచ్చాడు. ఇద్దరు కలిసి సైబరాబాద్, హైదరాబాద్​లిమిట్స్​లో 15 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ సమావేశంలో మియాపూర్​ఇన్​స్పెక్టర్​క్రాంతికుమార్, డిఐ రమేష్​నాయడు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read: Nagarkurnool Survey: చెంచులపై కేద్రం ఫోకస్.. వారి అభివృద్ధికి రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికలు

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?