Gold Rate ( 05-06-2025) : తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారానికి (Gold Rate ) అధిక ప్రాధాన్యతను ఇస్తారు. గత కొద్దీ రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఇక, గోల్డ్ ధరలు తగ్గితే మాత్రం కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు.ఎందుకంటే, ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారాన్ని తప్పకుండా కొనుగోలు చేస్తారు. ఏదైనా ఫంక్షన్ లో మహిళలు బంగారు ఆభరణాలు పెట్టుకుని మురిసిపోతుంటారు.
మే నెలలో పెళ్లిళ్లు ఎక్కువ ఉండటంతో ధరలు ఇలా అమాంతం పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో ఎంతో కొంతో బంగారం రేటు పెరగడం సహజం. మరి, ఇంతలా పెరగడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం రూ.99,600 గా ఉంది. ఈ నెల చివర్లో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల క్రమంలో బంగారం ధరలు తగ్గుతాయని అంటున్నారు.
నిన్నటి మీద పోలిస్తే.. ఈ రోజు నుంచి తగ్గిన గోల్డ్ ధరలు ( Gold Rates ) పెరగడంతో మహిళలు బంగారం కొనాలంటే షాక్ అవుతున్నారు. 24 క్యారెట్స్ బంగారం ధర పై రూ. 430 కు పెరిగి రూ.99,170 గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 400 కు పెరిగి రూ.91,300 గా విక్రయిస్తున్నారు. కిలో వెండి ధర రూ.1,14,100 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్ ( Hyderabad ) , విజయవాడలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.91,300
విజయవాడ ( Vijayawada) – రూ.91,300
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ.91,300
వరంగల్ ( warangal ) – రూ.91,300
24 క్యారెట్లు బంగారం ధర
విశాఖపట్టణం ( visakhapatnam ) – రూ. 99,600
వరంగల్ ( warangal ) – రూ. 99,600
హైదరాబాద్ ( Hyderabad ) – రూ.99,600
విజయవాడ – రూ. 99,600
వెండి ధరలు
గత కొన్ని రోజుల నుంచి వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో వెండి ధర మార్కెట్లో రూ.1,06,000 వద్ద ఉండగా.. మరో రూ.8,000 కు పెరిగింది. ప్రస్తుతం, కిలో వెండి రూ.1,14,000 గా ఉంది. ఒక్కో రోజు ఈ ధరలు తగ్గుతున్నాయి, మళ్లీ అకస్మాత్తుగా ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
విజయవాడ – రూ.1,14,000
విశాఖపట్టణం – రూ.1,14,000
హైదరాబాద్ – రూ.1,14,000
వరంగల్ – రూ.1,14,000
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.