Ganja Seized( IMAGE CREDIT: SWETCHA REPORTER)
హైదరాబాద్

Ganja Seized: ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 53 లక్షల విలువైన గంజాయి సీజ్!

Ganja Seized: మాదక ద్రవ్యాలకు చెక్​ పెట్టేందుకు ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్​ లో ఎక్సయిజ్ అధికారులు స్పీడ్​ పెంచారు. ఒక్క  రోజునే వేర్వేరు చోట్ల దాడులు జరిపి 60లక్షల రూపాయలకు పైగా విలువ చేసే 120 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆబ్కారీ భవన్​ లో మీడియా సమావేశంలో ఎక్సయిజ్​ అదనపు కమిషనర్ సయ్యద్​ యాసిన్​ ఖురేషి రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ దశరథ్​ తో కలిసి వివరాలు వెల్లడించారు.

హన్మకొండకు చెంది ప్రస్తుతం ఘట్​ కేసర్​ లో నివాసముంటున్న కట్ల వివేక్​ రెడ్డి గతంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ గా పని చేశాడు. చేస్తున్న ఉద్యోగం నుంచి ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో తేలికగా డబ్బు సంపాదించటానికి కొంతకాలంగా గంజాయి దందా మొదలు పెట్టాడు. హన్మకొండ ప్రాంతానికే చెంది ప్రస్తుతం మేడిపల్లిలో ఉంటున్న దగ్గుమల్లి కిరణ్​ రెడ్డితో క​లిసి ఒడిషా మల్కాన్​ గిరి జిల్లాకు చెందిన రాంబాబు అనే వ్యక్తి నుంచి గంజాయి తెచ్చి ఉప్పల్​ హెచ్​సీఎల్​ ప్రాంతంలోని ఓ గోడౌన్​ లో స్టాక్​ చేస్తున్నాడు.

 Alos Read: Minister Seethakka: హామీలపై కట్టుబాటు.. ములుగు ప్రజలకు.. మంత్రి భరోసా!

ఇలా నిల్వ చేసిన గంజాయిని లోకల్ పెడ్లర్లకు అమ్ముతున్నాడు. ఈ మేరకు పక్కగా సమాచారాన్ని సేకరించిన ఉప్పల్​ ఎక్సయిజ్ పోలీస్​ స్టేషన్ సీఐ ఓంకార్​, డీటీఎఫ్​ సీఐ భరత్​ భూషణ్​, ఎస్సైలు నరేశ్​ రెడ్డి, శ్రీనివాస్​ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి గోడౌన్​ పై దాడి చేశారు. రెండు కిలోల చొప్పున ప్యాక్​ చేసిన 56 ప్యాకెట్లు, కిలో చొప్పున ఉన్న 6 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వివేక్ రెడ్డిని అరెస్ట్​ చేశారు.

పరారీలో ఉన్న అతని సహచరుడు కిరణ్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న రాంబాబును అరెస్ట్ చేయటానికి మల్కాన్​ గిరికి త్వరలోనే ప్రత్యేక బృందాన్ని పంపించనున్నట్టు అదనపు కమిషనర్​ సయ్యద్​ యాసిన్​ ఖురేషి తెలిపారు. వివేక్ రెడ్డి, రాంబాబులపై ఇంతకు ముందే రెండేసి కేసులు నమోదై ఉన్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 53లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

 Alsao Read: Minister Ponnam Prabhakar: మొక్కులు తీర్చుకున్న మంత్రి .. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు!

మరో కేసులో…
ఇక, ఎక్సయిజ్​ స్​టేట్​ టాస్క్​ ఫోర్స్, జిల్లా టాస్క్​ ఫోర్స్​ అధికారులు మరో రెండు కేసుల్లో 12.230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్​ చేశారు. చర్లపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో కొంతమంది పెడ్లర్లు గంజాయి అమ్ముతున్నట్టుగా తెలియటంతో డీటీఎఫ్​ సీఐ భరత్​ భూషణ్​, ఎస్సై శ్రీనివాస్​ తోపాటు సిబ్బందితో క​లిసి దాడులు చేశారు. మధ్యప్రదేశ్​ కు చెందిన కుశ్వాహా, ఒడిషాకు చెందిన బైనాథ్ బిశ్వాల్ లను అరెస్ట్​ చేసి వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు. నిందితులను ఘట్​ కేసర్​ ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు. ఇక, నాందేడ్​ నుంచి డీసీఎం వ్యాన్​ లో గంజాయి వస్తున్నట్టుగా సమాచారం అందగా ఎస్టీఎఫ్​ ఎస్సై బాలరాజు సిబ్బందితో క​లిసి శివార్లలో దానిని పట్టుకున్నారు. 2.230 కిలోల గంజాయి, డీసీఎం వ్యాన్ ను సీజ్​ చేశారు. వ్యాన్​ డ్రైవర్​ ఫైజల్​ ను అరెస్ట్​ చేశారు.

భారీగా బెల్లం పట్టివేత…
నాటు సారా తయారీలో ఉపయోగించే నల్ల బెల్లాన్ని ఎక్సయిజ్ అధికారులు సీజ్​ చేశారు. హైదరాబాద్​ నుంచి ఓమినీ వ్యాన్​ లో నల్ల బెల్లాన్ని నాగర్​ కర్నూల్​ ఎండబెట్ల గ్రామానికి తరలిస్తున్నట్టు తెలిసి ఎస్టీఎఫ్​ ఎస్సై బాలరాజు, సాయికిరణ్​, కౌశిక్​, నితిన్​, హనీష్​, శంకర్​, సంతోష్​, సాయికృష్ణలతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 432 కిలోల నల్ల బెల్లం, 10 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు