Minister Ponnam Prabhakar ( image credit: swetcha reporter)
మెదక్

Minister Ponnam Prabhakar: మొక్కులు తీర్చుకున్న మంత్రి .. ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు!

Minister Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కాళ్లకు ఆరు కిలోల రెండు వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు వాయిద్య కారులతో కలిసి నృత్యం చేసి అందరిని ఉత్సాహపరచారు. హుస్నాబాద్ ఎల్లమ్మ ఉత్సవాలు, బోనాలు నేడు వైశాఖ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

 Also Read: Minister Seethakka: హామీలపై కట్టుబాటు.. ములుగు ప్రజలకు.. మంత్రి భరోసా!

మళ్ళీ పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొని అంగరంగ వైభవంగా జరుపుకుంటారన్నారు. హుస్నాబాద్ నాయకులు, ప్రజలంతా వచ్చే భక్తులకు ఆతిధ్యం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం అవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కొంగు బంగారంగా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఇస్తుందన్నారు. అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలనీ, కాకతీయుల కాలం నాటి నుండి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుండి హుస్నాబాద్ ఎల్లమ్మకు చరిత్ర ఉందన్నారు.

ఉత్సవాల్లో బోనాలు ,పట్నాలు , ఒడిబియ్యం కార్యక్రమాలు జరుపుకుంటారనీ, అందరూ సుభిక్షంగా ఉండాలని ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని వేడుకుంటున్నట్లు వెల్లడించారు. నేడు అమ్మవారి కళ్యాణ మహోత్సవంతో ప్రారంభమైన జాతర ఉత్సవాలు నెల రోజులపాటు కొనసాగుతాయి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు