Warangal Crime: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో పట్టపగలు పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో ఓ మహిళపై యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. కాటారం మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లక్ష్మీ(లచ్చక్క)( 42) అనే మహిళపై మారుపాక అంజి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.
Hyderabad Crime: మద్యం మాయ.. సోదరుల మధ్య తగాదా.. బావ హత్యకు దారి!
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గతంలో భూవివాదంలో తన తండ్రి మారుపాక సారయ్యని చంపారని కక్ష పెంచుకున్న అంజి ఆదుకునుకోసం చూస్తూ ఈ రోజు కాటారంలో ఒంటరిగా దొరికిన మహిళను గొడ్డలితో నరికాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ ఎదురుగా జరగడం అందరిని విస్మయానికి గురి చేస్తుంది. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మీ పరిస్థితి విషమంగా ఉందని, చికిత్స కోసం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు గ్రామస్తులు తెలిపారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు