Vijayawada Crime: ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ గుణదలలో విషాదం జరిగింది. డ్రైనేజీలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందాడు. గుణగల గంగిరెడ్డుల దిబ్బలో వుంటున్న మణికంఠ అనే బాలుడు మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడ్డాడు. వర్షాలకు నీరు ఎక్కువగా పారుతుండడంతో ఓ బాలుడు కొట్టకుపోగా మరో బాలుడిని స్థానికులు కాపాడారు. కొట్టుకుపోయిన మణికంఠ మృతదేహం గుణగల సెంటర్లో తేలింది. వెంటనే మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.
Also Read: Child demonization: పిల్లలపై పెరిగి పోతున్న అరాచకాలు.. కారణం అవేనంటారా!
గతంలో కూడా విజయవాడలో ఇలాంటి సంఘటనే జరిగింది. గురునానక్ కాలనీలో ఓ బాలుడు కాల్వలో పడి కొట్టుకుపోయాడు. అప్పుడు భారీ వర్షానికి గురునానక్ కాలనీలోని కాల్వ ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ డ్రైనేజీలో పడ్డాడు. మిత్రులతో కలిసి ఆడుకుంటుండగా కాలు జారి అందులో పడిపోయాడు. ఆ తర్వాత వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు కాల్వలో గాలించారు. కానీ బాలుడు ఎక్కడా కనిపించలేదు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. డ్రైనేజీ మరో బాలుడిని పొట్టన పెట్టుకుంది.