Vikarabad district (Image Source: AI)
Viral

Vikarabad district: ఛార్జింగ్ కోసం ఎగబడ్డ జనం.. మీ కష్టం పగోడికి కూడా రాకూడదు!

Vikarabad district: ప్రస్తుత రోజుల్లో మెుబైల్ ఫోన్ ప్రతీ ఒక్కరికీ అత్యవసరంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్లాలన్న, ఏ పని చేయాలన్న చేతిలో మెుబైల్ ఫోన్ ఉండాల్సిందే. సెల్ ఫోన్.. ఒక క్షణం కనిపించకపోయినా కొందరు విలవిలలాడిపోతుంటారు. ఏ క్షణంలో ఏ ఉపద్రవం వస్తుందో అన్నట్లుగా ఎప్పుడు మెుబైల్ ను ఛార్జ్ చేస్తూనే ఉంటారు. రైల్వే స్టేషన్, బస్ స్టాప్ లలో ఈ తరహా వ్యక్తులను చూస్తూనే ఉంటాం. ఇదిలా ఉంటే ఓ గ్రామంలో తలెత్తిన విద్యుత్ సంక్షోభం.. మెుబైల్ యూజర్లను చిక్కుల్లో పడేసింది. దీంతో వారు చేసిన పని ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఏం జరిగిందంటే?
శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ చెట్లు, కరెంటు స్థంబాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే రెండ్రోజుల క్రితం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడగా విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపడ్డాయి. ఫలితంగా గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఛార్జింగ్ కోసం ఎగబడ్డ జనం
విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోటర్లు పనిచేయక నీటి సమస్య తలెత్తింది. ఇది గమనించిన గ్రామంలోని యువకులు… చందాలు వేసుకొని డీజిల్ జనరేటర్ తెప్పించారు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో మెుబైల్ ఛార్జింగ్ సాకెట్లను ఏర్పాటు చేశారు. ఇది తెలుసుకున్న గ్రామస్థులు తమ మెుబైల్స్ కు ఛార్జింగ్ పెట్టుకునేందుకు పోటీ పడ్డారు. భారీగా జనరేటర్ వాహనం వద్ద గుమికూడి సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెడుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. వీరి కష్టం పగోడికి కూడా రాకూడదంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Vijayshanthi: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రిజల్ట్‌తో రాములమ్మ గుడ్ ‌బై చెప్పేసినట్టేనా?

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ