తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Ganja Seized: వేర్వేరు చోట్ల దాడులు జరిపిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఓల్డ్ మలక్ పేట నివాసి మహ్మద్ ఇమ్రాన్ (32) చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో రౌడీషీటర్ గా నమోదై ఉన్నాడు. 15కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితునిగా ఉన్న మహ్మద్ ఇమ్రాన్ ప్రస్తుతం ఓల్డ్ మలక్ పేట ప్రాంతంలో పాన్ షాప్ నడుపుతున్నాడు. కాగా, మత్తుకు అలవాటు పడ్డ మహ్మద్ ఇమ్రాన్ చాలా రోజులుగా మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు తీసుకోవటానికి అలవాటు పడ్డాడు.
ఇక, పాన్ షాప్ ద్వారా ఆశించిన ఆదాయం రాకపోతుండటంతో ఆ ఇంజక్షన్లతోపాటు ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయి అమ్మటం మొదలు పెట్టాడు. ఓల్డ్ మలక్ పేట వాహెద్ నగర్ మహారాజా హోటల్ వద్ద ఈ మత్తు పదార్థాలను అమ్ముతున్నాడు. ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేందర్ , ఎస్సైలు నవీన్, మహేశ్, ఆంజనేయులు, నర్సింలుతోపాటు చాదర్ ఘాట్ పోలీసులతో కలిసి దాడి చేసి మహ్మద్ ఇమ్రాన్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి 2లక్షల రూపాయల విలువ చేసే మెఫెంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, ఆల్ఫాజోలెం టాబ్లెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం చాదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Hyderabad Crime: చంపి మరీ మృతదేహంపై డ్యాన్సులు.. ఓ యువకుడి నిర్వాకం..
మరో కేసులో…
మరో కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి నుంచి లక్షా 20వేల విలువ చేసే మెఫంటిమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. శాలిబండ నివాసి సయ్యద్ అసద్ (28) వృత్తిరీత్యా దర్జీ. కాగా, మత్తుకు అలవాటు పడ్డ సయ్యద్ అసద్ న్యూట్టాడు. ఈఢిల్లీలోని ఇండియా మార్ట్ నుంచి ఆన్ ద్వారా ఇంజక్షన్లు తెప్పించుకుని తీసుకునేవాడు. కాగా, సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రయత్నించే వారి నుంచి ఈ ఇంజక్షన్లకు డిమాండ్ ఉందని తెలియటంతో వాటిని అమ్మటం మొదలు పె క్రమంలో తన స్నేహితులైన బాలాపూర్ నివాసి అహమద్ ఖురేషీతోపాటు ఓ మైనర్ బాలుని ద్వారా హరిబౌలి చౌరస్తా ప్రాంతంలో ఈ ఇంజక్షన్లను అమ్మిస్తున్నాడు.
ఈ మేరకు సమాచారం సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ రాఘవేందర్ , ఎస్సైలు నవీన్, మహేశ్, ఆంజనేయులు, నర్సింలుతోపాటు మొఘల్ పురా పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం మొఘల్ పురా పోలీసులకు అప్పగించారు.
Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/