HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?
HCU Land Issue(image credit:X)
హైదరాబాద్

HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?

HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలను ప్రభుత్వం సీరియస్​ గా పరిగణిస్తోంది. ఏఐ సహాయంతో చేసిన ఈ వీడియోల వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై దృష్టిని సారించింది. వీటి వెనక ఎవరున్నా సరే కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోష​ల్​ మీడియాలో పలు వీడియోలు హల్​ చల్​ సృష్టించిన విషయం తెలిసిందే.

అక్కడున్న చెట్లను నరకటం వల్ల జింకలు, నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని వీడియోలను పలువురు అప్​ లోడ్​ చేశారు. ఏఐ సహాయంతో రూపొందిన ఈ వీడియోలు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పారు.

Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు

కాగా, ఫేక్​ వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు ఈ దిశలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకుడు క్రిశాంక్​, ధృవ్​ రాఠీ తదితరులపై కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..