HCU Land Issue(image credit:X)
హైదరాబాద్

HCU Land Issue: HCU భూముల వివాదం.. సెలబ్రిటీలపై కేసులు?

HCU Land Issue: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోషల్​ మీడియాలో చక్కర్లు కొట్టిన వీడియోలను ప్రభుత్వం సీరియస్​ గా పరిగణిస్తోంది. ఏఐ సహాయంతో చేసిన ఈ వీడియోల వెనక ఎవరెవరు ఉన్నారు? అన్నదానిపై దృష్టిని సారించింది. వీటి వెనక ఎవరున్నా సరే కేసులు నమోదు చేయాలని నిర్ణయించింది. కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సోష​ల్​ మీడియాలో పలు వీడియోలు హల్​ చల్​ సృష్టించిన విషయం తెలిసిందే.

అక్కడున్న చెట్లను నరకటం వల్ల జింకలు, నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయంటూ కొన్ని వీడియోలను పలువురు అప్​ లోడ్​ చేశారు. ఏఐ సహాయంతో రూపొందిన ఈ వీడియోలు ప్రజల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది మేనకా గురుస్వామి చెప్పారు.

Also read: DGP jithender: అంకితభావంతో పని చేయాలి.. పోలీసులకు డీజీపీ జితేందర్ సూచనలు

కాగా, ఫేక్​ వీడియోలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందటంతో పోలీసులు ఈ దిశలో చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, బీఆర్​ఎస్​ నాయకుడు క్రిశాంక్​, ధృవ్​ రాఠీ తదితరులపై కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!