Phone Tapping Case [image credit; canva]
Uncategorized

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసులో బిగ్ షాక్… తుప్పు పట్టిన మొబైల్ ఫోన్ తెచ్చిన శ్రవణ్​ రావు?

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​ కేసు నిందితుడు శ్రవణ్​ రావు విచారణాధికారులకు షాకిచ్చాడు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన సెల్​ ఫోన్లను తెచ్చివ్వమంటే ఓ తుప్పు పట్టిన మొబైల్​ ఫోన్ ఇచ్చాడు. దాంతో అవాక్కయిన విచారణాధికారులు అడిగిన రెండు ఫోన్లు తీసుకుని ఈనెల 8న మరోసారి విచారణకు హాజరు కావాలని అతనికి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో కేసులు నమోదు కాగానే విదేశాలకు పారిపోయిన ఎస్​ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్​ రావుతోపాటు ఓ టీవీ ఛానల్​ అధినేత శ్రవణ్​ రావులపై అధికారులు రెడ్​ కార్నర్​ నోటీసులను కూడా జారీ చేయించారు. అరెస్ట్​ తప్పదని భావించిన శ్రవణ్​ రావు ముందస్తు బెయిల్​ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్​ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్​ మంజూరు చేయకున్నా శ్రవణ్​ రావును అరెస్ట్​ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో పోలీసుల విచారణకు హాజరు కావాలని శ్రవణ్​ రావుకు సూచించింది. ఈ నేపథ్యంలో గతనెల 29న శ్రవణ్​ రావు సిట్​ ఎదుట హాజరయ్యాడు.

 Also Read: Madhurawada Crime: ప్రేమ పేరుతో దాడి.. ప్రియురాలి తల్లి మృతి.. వైజాగ్ లో దారుణం

ఆ రోజున దాదాపు ఏడుగంటలపాటు శ్రవణ్​ రావును ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో వాడిన రెండు సెల్​ ఫోన్లను తీసుకుని విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11.30గంటల సమయంలో శ్రవణ్​ రావు జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​ కు వచ్చి విచారణకు హాజరయ్యాడు. అయితే, అధికారులు చెప్పినట్టుగా అసెంబ్లీ సమయంలో ఉపయోగించిన మొబైల్​ ఫోన్లను తీసుకు రాలేదు.

ఓ తుప్పు పట్టిన సెల్​ ఫోన్​ ను అధికారులకు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికలపుడు దానినే ఉపయోగించానని చెప్పాడు. ఇక, పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు కూడా శ్రవణ్​ రావు సరైన సమాధానాలు చెప్పలేదని తెలిసింది. అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా గుర్తు లేదని జవాబిచ్చినట్టుగా సమాచారం. తనకు ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావుతో పరిచయం ఉన్న మాట నిజమే అని చెప్పినా అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వ పెద్దల పాత్రపై మాత్రం పెదవి విప్పలేదని తెలిసింది.

 Also Read: Sangareddy District: మీచేతిలో సెల్ ఫోన్ ఉందా.. తస్మాత్ జాగ్రత్త..

ఇదే కేసులో అరెస్టయిన మిగితా నిందితులను విచారించినపుడు శ్రవణ్​ రావు ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్టుగా వెల్లడైంది. ప్రత్యర్థి పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్​ కు చెందిన ఏయే నాయకుల ఫోన్లను ట్యాప్​ చేయాలన్న వివరాలను ఆయనే ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​ రావుకు అందచేసినట్టుగా తెలిసింది. దాంతోపాటు 18మంది జడ్జీలు, కాంగ్రెస్​ పార్టీకి నిధులు సమకూరుస్తారనుకున్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల పేర్లను కూడా శ్రవణ్​ రావే ఇచ్చి వారి ఫోన్లను ట్యాప్​ చేయించినట్టుగా వెల్లడైంది. బీఆర్​ఎస్​ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ మంత్రి అతనికి ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావును పరిచయం చేసినట్టుగా కూడా తెలిసింది. అయితే, తాజా విచారణలో ఈ వ్యవహారాలపై శ్రవణ్​ రావు నోరు విప్పలేదని తెలిసింది.

8న మరోసారి రావాలి…
ఎన్నిరకాలుగా ప్రశ్నించినా శ్రవణ్​ రావు సహకరించక పోవటంతో బుధవారం విచారణాధికారులు గంటలోపే విచారణను పూర్తి చేశారు. ఈనెల 8న మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈసారి వచ్చేటపుడు క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన సెల్​ ఫోన్లను ఖచ్చితంగా తీసుకు రావాలని దర్యాప్తు అధికారులు స్పష్టంగా చెప్పినట్టుగా తెలిసింది. లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించినట్టుగా సమాచారం. ఈసారైనా శ్రవణ్​ రావు ఆ రెండు మొబైల్​ ఫోన్లను తీసుకువచ్చి అప్పగిస్తాడా? లేదా? కేసులోని కీలక వివరాలను వెల్లడిస్తాడా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ లింక్https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు