Cyber Criminals Fraud(imagecredit:canva)
క్రైమ్

Cyber Criminals Fraud: మీ బాస్​ డీపీతో వాట్సాప్​ మెసెజ్​ వచ్చిందా…కొత్త దారుల్లో మోసాలు

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Cyber Criminals Fraud: ఎప్పటికప్పుడు కొత్త కొత్త దారుల్లో మోసాలు చేస్తున్న సైబర్​ క్రిమినల్స్​ ఇటీవలిగా బడా కంపెనీలను టార్గెట్​ చేస్తున్నారు. ఆయా కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి డీపీలతో ఉద్యోగులకు వాట్సాప్​ మెసెజీలు పెట్టి లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇటీవలిగా ఈ తరహా నేరాలు అధికమైన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్​ బహుపరాక్‌​ అని హెచ్చరిస్తున్నారు. కంపెనీ ఛైర్మన్​ అని ఎండీ అని ఎవరైనా వాట్సాప్​ మెసెజీలు పంపించి డబ్బు ట్రాన్స్​ ఫర్​ చేయమంటే ఒకటికి రెండుసార్లు క్రాస్​ చెక్​ చేసుకోవాలని సూచిస్తున్నారు.

వాట్సాప్​ డీపీ మెసెజ్   

హైదరాబాద్​ ల ఉన్న ఓ ప్రముఖ సంస్థలో అకౌంటెంట్​ గా పని చేస్తున్న ఉద్యోగికి పదిహేను రోజుల క్రితం ఆ సంస్థ సీఎండీ డీపీతో వాట్సాప్​ మెసెజ్ వచ్చింది. అందులో కొత్త ప్రాజెక్టు కోసం అర్జంటుగా 1.95 కోట్లు అవసరమని, ఫలానా ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ఉంది. ప్రొఫైల్​ లో ఉన్న ఫోటో చూసి సీఎండీయే ఆ మెసెజీ పంపించి ఉంటారని భావించిన అకౌంట్స్​ ఆఫీసర్ నగదును ఆయా ఖాతాల్లోకి బదిలీ చేశాడు. నగదు ట్రాన్స్​ ఫర్​ అయినట్టు తన ఫోన్​ కు మెసెజీలు రావటంతో కంగారు పడ్డ సంస్థ సీఎండీ వెంటనే అకౌంట్స్​ ఆఫీసర్​ తో మాట్లాడగా జరిగింది మోసమని స్పష్టమైంది. గడిచిన మూడు నెలల్లోఈ తరహా మోసాలు నాలుగైదు వెలుగు చూడటం గమనార్హం.

డేటాను కొని   

ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్​ క్రిమినల్స్​ వేర్వేరు మార్గాల్లో ముందుగా ఫోన్​ నెంబర్లను వేర్వేరు మార్గాల్లో కొని ఆ తరువాత నేరాలకు పాల్పడుతున్నట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ప్రైవేట్​ బ్యాంకులు, ఇన్సూరెన్స్​ సంస్థల్లోని కస్టమర్​ కేర్​ విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది సిబ్బందికి డబ్బు ఆశ చూపించి ఫోన్​ నెంబర్లు సేకరిస్తున్నారన్నారు. దాంతోపాటు ఆ ఫోన్​ నెంబర్లు కలిగి ఉన్నవారి వివరాలు మొత్తం తీసుకొంటున్నారని చెప్పారు.

Also Read: Heatwave Alert In TG: బయటికి వెళ్లారో.. తస్మాత్ జాగ్రత్త.. ఈ హెచ్చరిక మీకోసమే!

ఆ తరువాత పెద్ద పెద్ద కంపెనీల్లో కీలక స్థానాల్లో ఉన్న వారి ఫోటోలను సోషల్​ మీడియా నుంచి డౌన్​ లోడ్​ చేసుకుంటున్నట్టు చెప్పారు. అనంతరం ఆ ఫోటోలను డీపీలుగా పెట్టి ఆయా కంపెనీల్లో పని చేస్తున్న అకౌంట్స్​ ఆఫీసర్లకు వాట్సాప్ మెసెజీలు పెడుతున్నారని తెలిపారు. వచ్చిన మెసెజీలో తమ బాస్​ ల ఫోటోలు ఉండటంతో వాటిని నిజమే అని నమ్ముతున్న అకౌంట్స్​ ఆఫీసర్లు ముందూ వెనకా ఆలోచించకుండా డబ్బును ట్రాన్స్​ ఫర్​ చేస్తున్నట్టు చెప్పారు. డబ్బు బదిలీ అయినట్టు బ్యాంకుల నుంచి ఎస్​ఎంఎస్​ లు వచ్చిన తరువాతగానీ జరిగింది మోసమని గ్రహించ లేకపోతున్నారన్నారు.

క్రాస్ చెక్ చేసుకోవాలి 

ఇలా వచ్చే వాట్సాప్ మెసెజ్ లను అస్సలు నమ్మవద్దని సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్ చెబుతున్నారు. మెసెజ్​ వస్తే వెంటనే ఫోన్​ చేసి అది నిజంగా తమ పైవారు పంపించారా? లేదా? అన్నది నిర్ధారించుకోవాలని సూచించారు. ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా ఇలా జరుగుతున్న మోసాలపై అకౌంట్స్​, ఫైనాన్స్​, హెచ్​ ఆర్​, అడ్మి న్​ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందికి అవగాహన కల్పించాలని చెప్పారు.

ఇలాంటి మెసెజ్ లు వస్తే నగదును ట్రాన్స్​ ఫర్​ చెయ్యకుండా 1930 కి సమాచారం అందించాలన్నారు. ఒకవేళ నగదును బదిలీ చేసినా మొదటి గంటలోపే ఈ నెంబర్​ కు ఫిర్యాదు చేయాలన్నారు. అప్పుడు నగదు సైబర్​ క్రిమినల్స్​ చేతుల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

Also Read: Ganja Seized: ఆ జిల్లాలో గంజాయి దహనం.. విలువ తెలిస్తే షాక్ కావాల్సిందే!

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ