తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Credit Card Fraud: క్రెడిట్ కార్డు డీ యాక్టీవేట్ కాకుండా చూస్తానని గృహిణికి టోకరా ఇచ్చిన సైబర్ క్రిమినల్స్ 2.20 లక్షల రూపాయలు కొట్టేశారు. వివరాలు లోకి వెలితే ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ గృహిణికి అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ క్రెడిట్ కార్డు డీ యాక్టీవేట్ కానుంది. అలా కాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేయండంటూ ఓ యాప్ లింకును పంపించాడు.
బాధితురాలు దానిపై క్లిక్ చేయగా ఓపెన్ కాలేదు. అదే విషయాన్ని ఫోన్ చేసిన వ్యక్తికి చెప్పగా గూగుల్ క్రోంలోకి వెళ్లి తాను చెప్పిన యాప్ ను ఓపెన్ చేయమన్నాడు. అలాగే చేసిన బాధితురాలు యాప్ ఓపెన్ కావటంతో తన క్రెడిట్ కార్డుతోపాటు ఇతర వివరాలను అప్ లోడ్ చేసింది. ఆ వెంటనే ఆమె ఫోన్ ను హ్యాక్ చేసిన అవతలి వ్యక్తి ఐసీఐసీఐ, అమెరికన్ బ్యాంకుల్లో బాధితురాలి పేరున ఉన్న అకౌంట్ల నుంచి 2.20 లక్షలు డబ్బును ట్రాన్స్ ఫర్ చేశాడు.
Also Read: Sitarampur Man Suicide: వచ్చేది సరిపోదా? మరీ ఇంత కక్కుర్తి ఎందుకు? నెటిజన్స్ ఫైర్…
ఆ మేరకు ఆయా బ్యాంకుల నుంచి మెసెజీలు రావటంతో జరిగింది మోసమని గ్రహించిన బాధితురాలు వెంటనే ఐసీఐసీఐ బ్యాంక్ వర్గాలకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి తన ఖాతా నుంచి నగదు బదిలీ కాకుండా చూడాలని చెప్పింది. దాంతోపాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు