తెలంగాణ బ్యూరో స్వేచ్చ: DK Aruna: బీజేపీ ఎంపీ డీ.కే.అరుణ ఇంట్లో చోరీ యత్నం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ సోమవారం జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి వెళ్లారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. అనంతరం దొంగ ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు?…ఎలా బయటకు వెళ్లాడు? అన్న వివరాలు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లో ఎంపీ డీ.కే. అరుణ నివాసం ఉంది. ఇదెలా ఉండగా శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఓ దొంగ ప్రహారీగోడ దూకి ఆమె ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు.
అనంతరం వంట గది వద్ద ఉన్న కిటికీ తెరిచి ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లోని హాల్ తో పాటు వేర్వేరు గదుల్లో దాదాపు గంటన్నరపాటు కలియ దిరిగాడు. అదడికి విలువైన వస్తువులేవీ చేతికి చిక్కక పోవటంతో వచ్చిన దారినే మల్లి తిరిగి పారిపోయాడు. దీంతో ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఎంపీ డీ.కే.అరుణ కూడా జరిగిన ఈ ఉదంతంపై ఆందోళన వ్యక్తం చేశారు. దొంగ ఇంట్లోకి చొరబడినపుడు తన కూతురు ఇంట్లోనే ఉందని చెప్పారు. అలికిడికి నిద్ర మేల్కొని బయటకు వచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అన్న కలవరాన్ని ఆమే వ్యక్తం చేశారు.
Also Read: Nizamabad Crime News: కన్నతల్లిని చంపిన కుమార్తె.. నిజామాబాద్ లో దారుణం..
దీంతో వెంటనే తన నివాసం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన చోరీ యత్నంపై ఆరా తీశారు. వెంటనే ఎంపీ నివాసానికి వెళ్లి పరిస్థితులను సమీక్షించి అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ సోమవారం ఎంపీ నివాసానికి వెళ్లారు. ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించారు.
Also Read: Bihar Crime: చోరీలలో ఇదో వెరైటీ.. గోల్డ్ రింగ్స్ మింగేసి మరీ..