Ranga Reddy District ( image credit: swetcgha reporter)
నార్త్ తెలంగాణ, రంగారెడ్డి

Ranga Reddy District: కార్పొరేట్ పేరుతో కోట్ల వసూళ్లు.. ప్రైవేట్ స్కూల్స్‌పై పర్యవేక్షణ ఎక్కడ?

Ranga Reddy District: ప్రైవేట్​ స్కూల్స్​పై విద్యాశాఖాధికారులు పర్యవేక్షణ పూర్తిగా కోరవడింది. కేవలం పైపై పర్యవేక్షణతో కాలం వెల్లదిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు విభిన్నంగా అధికారులు తీరు కనిపిస్తోంది. అకాడమిక్​ ఇయర్​ ప్రారంభంలో ప్రతి ప్రైవేట్​ స్కూల్స్​ విధిలో భాగంగా పర్యవేక్షించాలి. కానీ కేవలం పర్యవేక్షించామని చెప్పుకోవడానికే పరిమితమై విద్యాధికారులు పనిచేస్తున్నట్లు స్పష్టమైతుంది. ఎప్పటికప్పుడు ప్రైవేట్​ స్కూల్స్ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా క్షేత్రస్థాయి అధికారులతో సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. ఇవేమీ తమకేమి అవసరం లేదన్నట్లు కేవలం ప్రభుత్వ స్కూల్స్​ పర్యవేక్షణపై ప్రభుత్వం సూచించే సూచనలను అమలు చేస్తూ పనిచేస్తున్నారు. విద్యావ్యవస్థ ఎవరికివారే యమున తీరు అనే విధంగా పనిచేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నర్థాకంగా మారుస్తున్నారు.

Also Read: Ranga Reddy District: పోస్టులు ఖాళీగా ఉండడంతో.. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు!

బరాబర్​ ఫీజులు వసూళ్లు

విద్యార్ధుల తల్లిదండ్రులను కార్పోరేట్​ పేరుతో నమ్మించి నిబంధనలకు విరుద్దంగా స్కూల్​లో చేర్చుకుంటారు. ఎల్​కేజీ నుంచే లక్షల్లో పీజులు వసూళ్లు చేస్తారు. కానీ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ నిర్వహాణను గాలీకి వదిలేస్తారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థులకు పాఠాలు చేబుతామని ప్రచారం చేసుకుంటారు. ఇలాంటి స్కూల్స్​లో విద్యార్థులను చెర్పించి భవిష్యత్తు విద్యకు దూరం చేస్తున్న పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తున్నాయి.

ఫీజులకు తగ్గట్టుగా ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహాణ ఉండాల్సిన బాధ్యత ఎంతైన ఉంటుంది. ఈ నిబంధనలను పాటించేలా జిల్లా విద్యాధికారులు పనిచేయాలి. ఈ అంశాలను పక్కకు పెట్టి కేవలం రాయభారంతోనే ప్రైవేట్ యాజమాన్యం అధికారులు కుమ్మక్కైతున్నారు. అధికారులు, ప్రైవేట్​ స్కూల్స్​ యాజమాన్యం కలిసి ఆడుతున్న నాటకాలతో విద్యార్ధులు బలైతున్నారు. వీటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తారు. ఎందుకంటే ఆ యాజమాన్యంతో అధికారులు ఇప్పటకే కుమ్మక్కై చేతివాటలకు ఆలవాటై తలదాచుకునే దుస్థితి ఉంది. మేడ్చల్​ జిల్లా కుత్బల్లాపూర్​లో జరిగిన సంఘటనలకు అధికారులే బాధ్యులని చెప్పక తప్పదు.

బంధనలకు విరుద్దంగా నిర్వహాణ

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని పెట్ బషీరాబాద్లోని శ్రీ చైతన్య స్కూల్ను శనివారం మున్సిపల్​ అధికారులు సీజ్​ చేశారు. స్కూల్ నిర్వహిస్తున్న భవనం నివాసగృహాం పేరుతో జీహెచ్​ఎంసీ అనుమతి తీసుకున్నారు. అదే భవనంలో నిబంధనలకు విరుద్దంగా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ నడిపించడం కమర్షియల్​గా అధికారులు గుర్తించారు. అయితే ఈ స్కూల్స్​ ప్రారంభ దశలో పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నిరెత్తిన్నట్లు వ్యవహారించారు.

విద్యార్ధుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్న వైనం

ఇప్పుడు స్కూల్​ల్లోని విద్యార్ధుల తల్లిదండ్రులు లబోదిబోమంటున్న వైనం కనిపిస్తుంది. మున్సిఫల్​ అధికారులు సీజ్​ చేసిన స్కూల్​ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యాశాఖాధికారులు జంకుతున్నారు. ఎటుకాకుండా మిడిల్​ ఆఫ్​ దిఇయర్​లో స్కూల్స్​ సీజ్​ చేస్తే విద్యార్ధుల పరిస్థితి ఎమీటని తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. సుమారుగా 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిపోయింది. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం స్కూల్స్​ ప్రారంభంలోనే చూడాల్సిన బాధ్యత ఇటు విద్యాశాఖాధికారులది… అటు మున్సిపాలిటీ అధికారులదని తల్లిదండ్రులు ఆవేధ వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ranga Reddy District Tahsildar: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్!

Just In

01

Rashmika Mandanna: సౌత్ ఇండియాలో రష్మికా మందాన టాప్ హీరోయిన్ ఎలా అయ్యారో తెలుసా.. రీజన్ ఇదే..

Election Commission: జూబ్లీహిల్స్‌లో సోదాలు ముమ్మరం.. అభ్యర్థుల వెనక షాడో టీమ్‌లు

Intermediate Exams: ఈసారి ఇంటర్ పరీక్షలు యథాతథం.. వచ్చే సంవత్సరం నుంచి మార్పులు

Satish Shah passes away: ప్రముఖ వెటరన్ నటుడు సతీశ్ షా కన్నుమూత..

BRS Party: జూబ్లీహిల్స్ ప్రచార సరళిపై గులాబీ నిత్యం ఆరా.. సొంత నేతలపై నిఘా!