Municipality Elections: కేంద్రంలో చక్రం తిప్పుతున్నబీజేపీ పార్టీ మహబూబాబాద్ (Mahabubabad) మున్సిపాలిటీ ఎన్నికల్లో 36 వార్డులకు గాను అన్ని వార్డుల్లోనూ పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ వార్డు కౌన్సిలర్లను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామనిబీజేపీ జిల్లా అధ్యక్షులు వల్లభ వెంకటేశ్వర్లు వెల్లడిస్తున్నారు. గతంలోనే బీజేపీ పార్టీకి మహబూబాబాద్ లో గట్టి పట్టు సాధించామని స్పష్టం చేస్తున్నారు. దేశ ప్రధానమంత్రి మోడీ నేతృత్వం ప్రతి ఒక్కరిని మెప్పించేలా, ఒప్పించేలా, ఆకర్షించేలా, ఆకట్టుకునే విధంగా ఉండడంతో మెజారిటీ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోపాలను ఎత్తిచూపుతూ తమ సత్తా చాటుతామని గొంతెత్తి చెబుతున్నారు.
కాంగ్రెస్ ఒప్పుకుంటే అలయన్స్ లేదంటే సొంతంగానే
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్తో మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆలోచన చేస్తున్నామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భామనపల్లి విజయ సారధి పేర్కొంటున్నారు. గత మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 12 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచామని, మరో ఆరు స్థానాల్లో 50లోపు ఓట్లతో ఓటమి చవి చూశామని చెబుతున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ కుదిరితే ఓకే… లేదంటే సిపిఐ పార్టీ సొంతంగానే 18 వార్డ్ లో పనిచేస్తామని వెల్లడిస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ సత్తా చూపిస్తామని చెబుతున్నారు. రానున్న మునిసిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ గెలుపు కీలకంగా మారనున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. గెలుపు లక్ష్యంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందని అందుకు తమ వద్ద అన్ని రకాల అర్హులైన వార్డు కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నారని వెల్లడిస్తున్నారు. గత మునిసిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ తన సత్తాను చాటుకుందని వివరిస్తున్నారు.
Also Read:Badangpet Municipality: బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతంలో పోస్టర్ల కలకలం
సొంతంగా అయితే 36 వార్డుల్లో టిఆర్ఎస్
దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్న సిపిఎం పార్టీ ప్రస్తుత మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో సొంతంగా అయితే 36 వార్డుల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. టిఆర్ఎస్ పార్టీతో అలయన్స్ కుదిరితే 12 స్థానాల వరకు ఒప్పుకుంటామని.. లేదంటే తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని రకాల ప్రణాళికలు రాసించుకుంటున్నామని వెల్లడిస్తున్నారు. ప్రజల పక్షాన నిత్యం పోరాడుతూ తమ వంతు సహాయాన్ని ప్రజలకు అందిస్తున్నామని, ఆ నేపథ్యంలోనే ప్రజలు సిపిఎం పార్టీని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లుగా వెల్లడిస్తున్నారు.
Also Read: Medchal Municipality: కాంట్రాక్ట్ బిల్లులు రావాలంటే.. మున్సిపల్ సిబ్బంది కనికరించాల్సిందే!

