Laxman On Amit Shah (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Laxman On Amit Shah: అమిత్ షా నక్సల్స్ బలం తగ్గింది అనడం సరికాదు.. లక్ష్మణ్!

Laxman On Amit Shah: హోమ్ మంత్రి అమిత్ షా మావోయిస్టు పార్టీకి డెడ్ లైన్ పెట్టడం రాజ్యంగా విరుద్ధం, మావోయిస్టుల బలం తగ్గిపోయిందని కేంద్ర ప్రభుత్వం అనడం సరికాదు. ఒక్కసారి మావోయిస్టులకు బహిరంగ సభ పెట్టుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళ బలం తగ్గిందో పెరిగిందో తెలుస్తుందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో పౌరహక్కుల సంఘము ఉమ్మడి వరంగల్ జిల్లా మూడవ మహాసభలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ బలం తగ్గింది అంటున్న కేంద్రం మావోయిస్టులకు ఒక బహిరంగ సభ పెట్టుకునే అవకాశం కల్పించాలన్నారు. మావోయిస్టులు శాంతి చర్చలకు ముందుకు రావడం అంటే ఆదివాసీలపై జరుగుతున్న ఆకృత్యాలను చూడలేక మాత్రమే అన్నారు. ఆదివాసీ ఐక్యవేదిక పేరుతో గ్రామాల్లో ఆదివాసీలపై జరుగుతున్న దారుణాలను ప్రజల్లోకి పౌరహక్కుల నేతలు తీసుకెల్లాలని కోరారు.

Also Read: MLA Harish Rao: ఉగ్రవాదం అంతమై శాంతి నెలకొనాలి.. ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

పోరాడి సాధించుకున్న హక్కుల్ని ప్రభుత్వాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలి. ఆదివాసీ హక్కుల కోసం ప్రతి ఒక్కరు పోరాటానికి సిద్ధం కావాలి. సహజ వనరులను పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కోసమే అడవుల్లో కేంద్ర బలగాల మోహరింపు సరికాదని లక్ష్మణ్ అన్నారు.

 

 

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు