ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో దగ్ధం
electric passenger auto
నార్త్ తెలంగాణ

ఇంటి ముందున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో దగ్ధం

నిజామాబాద్, స్వేచ్ఛ : నిజామాబాద్ లో ఇంటి ముందర పార్క్ చేసిన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో (Electric Passenger Auto) దగ్ధమైన ఘటన బుధవారం రాత్రి నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన ఎండీ ముసొద్దీన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేశాడు. ప్రతిరోజు మాదిరిగానే ఆయన బుధవారం రాత్రి ఇంటి ముందు ఆటో నిలిపి చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ పెట్టిన కొద్ది సమయానికి ఆటోలోంచి మంటలు రావడాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఆయనకు సమాచారం ఇచ్చారు. ఆటో యజమాని బయటికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికి అప్పటికే ఆటో పూర్తిగా దగ్ధమైపోయింది. ఆటో దగ్ధానికి బ్యాటరీ ఓవర్ చార్జింగ్ కావడమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా తెలియాల్సి ఉంది.

 

Just In

01

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!

Mathura Bus Fire: బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీ–ఆగ్రా హైవేపై బస్సు ప్రమాదం.. నలుగురు మృతి

Telangana Universities: ఓయూకు నిధులు సరే మా వర్సిటీలకు ఏంటి? వెయ్యి కోట్ల ప్యాకేజీపై ఇతర వర్సిటీల నిరాశ!