Warangal Road Accident
క్రైమ్, నార్త్ తెలంగాణ

Warangal | వరంగల్ లో ఘోర విషాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ (Warangal) శివారులోని మామునూరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో ఓ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికుల హృదయాలను కలిచివేసింది.

ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఓ లారీ రైలు పట్టాల లోడుతో వెళుతోంది. మామునూరు బెటాలియన్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రెండు ఆటోలని ఢీకొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడడంతో ఏడుగురు మృతి చెందగా… ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాగా, యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది