Warangal | వరంగల్ లో ఘోర విషాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
Warangal Road Accident
క్రైమ్, నార్త్ తెలంగాణ

Warangal | వరంగల్ లో ఘోర విషాదం.. ఏడుగురు స్పాట్ డెడ్

వరంగల్, స్వేచ్ఛ: వరంగల్ (Warangal) శివారులోని మామునూరులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఏడుగురి ప్రాణాలను బలిగొంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనలో ఓ బాలుడు కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికుల హృదయాలను కలిచివేసింది.

ఘటనకి సంబంధించిన వివరాల్లోకి వెళితే… ఓ లారీ రైలు పట్టాల లోడుతో వెళుతోంది. మామునూరు బెటాలియన్ సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రెండు ఆటోలని ఢీకొట్టింది. ఆటోపై రైలు పట్టాలు పడడంతో ఏడుగురు మృతి చెందగా… ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

కాగా, యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం