Siricilla
నార్త్ తెలంగాణ

Siricilla | సిరిసిల్లలో అగ్ని ప్రమాదం.. 14 గుడిసెలు దగ్ధం

కరీంనగర్​ బ్యూరో, స్వేచ్ఛ: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని సాయినగర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 14 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం చత్తీస్ ఘడ్ నుంచి వివిధ కూలీ పనుల కోసం సిరిసిల్లకు వలస వచ్చిన కూలీలు గత కొన్ని రోజులుగా కార్గిల్ లేక్ వద్ద గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆదివారం కూలీలు యాదవిధిగా కూలీ పనులకు వెళ్లారు.

Also Read : జిల్లా అధికారులకు మెమోలు జారీ చేసిన కరీంనగర్ కలెక్టర్

కూలీలు అందరు పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. గుడిసెలు కాలడం చూసిన స్థానికులు పోలీసులకు, ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది… మంటలు ఆర్పినప్పటికీ గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. కూలీల బట్టలతో పాటు సామాను కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?