కరీంనగర్ బ్యూరో, స్వేచ్ఛ: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల (Siricilla) పట్టణంలోని సాయినగర్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 14 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం చత్తీస్ ఘడ్ నుంచి వివిధ కూలీ పనుల కోసం సిరిసిల్లకు వలస వచ్చిన కూలీలు గత కొన్ని రోజులుగా కార్గిల్ లేక్ వద్ద గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఆదివారం కూలీలు యాదవిధిగా కూలీ పనులకు వెళ్లారు.
Also Read : జిల్లా అధికారులకు మెమోలు జారీ చేసిన కరీంనగర్ కలెక్టర్
కూలీలు అందరు పనులకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. గుడిసెలు కాలడం చూసిన స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది… మంటలు ఆర్పినప్పటికీ గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. కూలీల బట్టలతో పాటు సామాను కూడా పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.