సంగారెడ్డి: Lizard in Soft drink: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దపూర్ పట్నం హైవే పక్కన ఓ హోటల్లో డ్రింక్ తమ్సప్ కూల్ డ్రింక్ లో బల్లి అవశేషాలు దర్షన మిచ్చాయి అది చూసిన వ్యక్తి ఒక్క సారీగా షాక్ కి గురయ్యాడు. అదితాగిన వ్యక్తి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వేసవి కాలంలోఎండతీవ్రతను తట్టుకోలేక కాస్త శరీరాన్ని చల్లపరుచుకొనుటకు సాధారనంగా అందరు శీతల పానీయాలు తాగుతుంటారు.
అయితే గతంలో కూడా ఇలాంటి సంగటనలు జరుగుతూ ఉన్నాయి. కొందరు వ్యక్తులైతే కాలం చెల్లిన శీతల పానీయాలు కూడా అమ్ముతున్నారు. ప్రజల వీటిని అమ్మే వ్యక్తులపై అప్రమత్తంగా వుండాలి లేదంటే మనం కొనితెచ్చుకునే పానీయాలతో రోగాలను కొని తెచ్చుకున్న వాల్లం అవుతాం.
వేడి తీవ్రతను తగ్గించు కోవాలనే ఆలోచనలతో మనం దాహం మీద కూల్ డ్రింక్స్ బాటిల్లను సరిగ్గా చూడకుండా ఎడా పెడా తాగేస్తున్నాం అయితే దీనిపై త్రాగేముందు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి ఆలోచించి తాగాలీ లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయి.
Also Read: Liquor Price Hike: మందు బాబులకు మద్యం పై బిగ్ షాక్.. పెరగనున్న మద్యం ధరలు!