Indiramma Atmiya Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిలేని కౌలు రైతులకు ఊరట కల్పించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంను ప్రవేశపెట్టారు. ఈ పథకం కేవలం కౌలు భూముల్లో వ్యవసాయం చేసే రైతుల కోసమే రూపొందించబడింది. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా, 2025 జనవరి 26న ఈ పథకం అధికారికంగా ప్రారంభమైంది. దీంతో పాటు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్ పథకాలు కూడా లాంచ్ అయ్యాయి. ఈ పథకం ద్వారా భూమిలేని రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యం. ఏడాదికి రూ.12,000 సహాయం, రెండు వాయిదాల్లో (రూ.6,000 చొప్పున) నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
పథకం హైలైట్స్ఆర్థిక సహాయం: ఎకరానికి రూ.12,000 (రెండు రూ.6,000 వాయిదాల్లో, DBT ద్వారా)
లక్ష్యం: భూమిలేని కౌలు రైతులకు ఆర్థిక స్థిరత్వం.
ప్రారంభం: జనవరి 26, 2025.
ఇతర పేర్లు: TS ఇందిరమ్మ ఆత్మీయ భరోసా యోజన, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తిట్టం.
అర్హతలు (ఎలిజిబిలిటీ)ఈ పథకం కింద అర్హత పొందాలంటే, ఈ క్రింది షరతులు తప్పనిసరి (మార్గదర్శకాలు మారే అవకాశం ఉంది)
నివాసం: తెలంగాణలో స్థిర నివాసి అయి ఉండాలి.
రైతు స్థితి: భూమిలేని కౌలు రైతు అయి ఉండాలి (సొంత సాగు భూమి ఉండకూడదు).
కుటుంబం: ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అర్హులు.
NREGA: కనీసం 20 రోజులు NREGP కింద పని చేసి ఉండాలి.
అనర్హతలు
– ఈ క్రింది వారు పథకం ప్రయోజనాలకు అర్హులు కాదు:రైతు భరోసా పథకం లబ్ధిదారులు.
– సొంత సాగు భూమి కలిగిన రైతులు.
Also Read: Crows: కాకులు ఇంటి చుట్టూ తిరుగుతున్నాయా.. అది చెడు శకునమా? జ్యోతిష్యలు ఏం చెబుతున్నారంటే?
అవసరమైన డాక్యుమెంట్స్దరఖాస్తు సమయంలో ఈ పత్రాలు సిద్ధం చేయండి
– ఆధార్ కార్డ్
– నివాస రుజువు (తెలంగాణ)
– భూమి యజమాని నుంచి కౌలు సర్టిఫికెట్
– పాస్పోర్ట్ సైజు ఫొటో
– రేషన్ కార్డ్
– NREGA జాబ్ కార్డ్
– బ్యాంకు పాస్బుక్ (DBT కోసం)
– మొబైల్ నంబర్
నోటిఫికేషన్లో పేర్కొన్న ఇతర డాక్యుమెంట్స్
దరఖాస్తు ఎలా చేయాలి?
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం ఆఫ్లైన్లో దరఖాస్తు చేయవచ్చు
– సమీపంలోని CSC (కామన్ సర్వీస్ సెంటర్) లేదా ప్రజాపలన కేంద్రంను సందర్శించండి.
– అధికారిక దరఖాస్తు ఫారమ్ను తీసుకోండి.
– ఫారమ్ను జాగ్రత్తగా పూర్తి చేసి, అన్ని డాక్యుమెంట్స్ ను జతచేయండి.
– అదే కేంద్రంలో ఫారమ్ సబ్మిట్ చేయండి.
– రిసీప్ట్/అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి.
