Urban Housing Policy: హైదరాబాద్‌లో ఇంటిస్థలం లేనోళ్లకు..
Ponguleti-Srinivas (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Urban Housing Policy: హైదరాబాద్‌లో ఇంటి స్థలం లేనివారికి గుడ్‌న్యూస్.. అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Urban Housing Policy: త్వరలో అర్బన్ హౌజింగ్ పాలసీ

అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజాప్రతినిధులతో మీటింగ్
సొంత భూమి లేని అర్హులైన లబ్దిదారులకు స్థలాలిస్తాం
అవసరమైతే అంతస్తులు పెంచి భవనాలు నిర్మిస్తాం
తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం
ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేస్తాం
మరో మూడు దఫాలుగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు
ఇందిరమ్మ ఇండ్లకు రూ.22వేల 500 కోట్లు
మూడు లక్షల ఇండ్లు మంజూరీ
50 వేల ఇళ్లలోకి గృహాప్రవేశాలు పూర్తి
చెంచులు, ఆదివాసీలకు 12 వేల 896 ఇండ్ల కేటాయింపు
శాసన సభలో రెవెన్యూ, హౌజింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ వంటి పట్టణ ఏరియాల్లో సొంత భూమి లేని నిజమైన అర్హుల కోసం సరి కొత్త అర్బన్ హౌజింగ్ పాలసీని (Urban Housing Policy) తీసుకురానున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం అసెంబ్లీలో వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో సొంత భూమి లేని లబ్దిదారులకు సర్కారు భూముల్లో మూడు నుంచి అయిదు అంతస్తుల భవనాలను నిర్మించి ఇండ్లను కేటాయిస్తామని వివరించారు. ఈ అంశంపై త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రశ్నోత్తరాల పర్వంలో భాగంగా సభ్యులు దానం నాగేందర్, బి. లక్ష్మారెడ్డి, జయధీర్ రెడ్డి, రాజ్ ఠాకూర్, బీర్ల ఐలయ్య, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, గండ్ర సత్యనారాయణ రావు, ధన్ పాల్ సూర్యనారాయణ, పాయం వెంకటేశ్వర్లు, రాకేశ్ రెడ్డిలు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు సంబంధించి పలు ప్రశ్నలను సంధించారు.

Read Also- Judge Inspection: కస్తూర్బా హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జడ్జి.. సంగారెడ్డిలో వెలుగులోకి నిజాలు

ముఖ్యంగా ప్రస్తుతం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సుమారు మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను కేటాయించినా, అవేమీ సరిపోవటం లేదని, క్షేత్ర స్థాయిలో లబ్దిదారులు ఎక్కువ మంది ఉన్నట్లు అదనంగా మరో వెయ్యి నుంచి మూడు వేల వరకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని సభ్యులు కోరారు. ముఖ్యంగా ఈ స్కీమ్ నకు సంబంధించి సొంత భూమి లేకుండా, అద్దె ఇళ్లలో, పూరి గుడిసెల్లో నివాసముంటున్న లబ్దిదారులున్నారని వివరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు అనేవి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే గొప్ప స్కీమ్ అని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద ఇప్పటికే రెండు దఫాలుగా ఇండ్లను కేటాయించగా, మరో మూడు దఫాలుగా కూడా ఇండ్లను కేటాయించి, పేదలకు సొంతింటిని సమకూర్చేందుకు సర్కారు కట్టుబడి ఉందని, తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏప్రిల్ మాసంలో మరో దఫా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను కేవలం మభ్య పెట్టిందన్నారు.

Read Also- Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

గత సర్కారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వివిధ దశల్లో చేపట్టిన అర్థాంతరంగా వదిలేయటంతో పాటు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన ఇండ్లు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. గత సంవత్సరం హోజింగ్ కు సంబంధించి రూ. 204 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు పెట్టిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 133 కాలనీల్లో 36 వేల ఇండ్లను సుమారు రూ. 744 కోట్లతో నిర్మించి మౌలిక వసతులను కల్పించటంతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లులను కూడా క్లియర్ చేసినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తతకు తీసుకున్న వాసాల మర్రి గ్రామ వాసులకిచ్చిన హామీలను కూడా నెరవేర్చని గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను త్వరలోనే రూ. 457 కోట్లతో మిగిలిన పనులు పూర్తి చేసి, లబ్దిదారులకు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ కింద 3 లక్షల ఇండ్ల నిర్మాణానికి గాను రూ. 22 వేల 500 కోట్లు కేటాయించి, ఇప్పటి వరకు 50 వేల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహా ప్రవేశాలు కూడా జరిగిపోయాయని మంత్రి తెలిపారు. హోజింగ్ లబ్దిదారులను సుమారు 20 లక్షల వరకు గుర్తించామని, ఆదివాసిలు, చెంచులు నివసించే ఐటీడీఏ ప్రాంతాలకు 12 వేల 500 ఇండ్లను కేటాయించామని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను కేటాయించటంలో అటవీ శాఖతో కాస్త సమస్యలున్నాయని, వాటిని త్వరలోనే పరిశీలిస్తామన్నారు.

హౌజింగ్‌పై స్పెషల్ మీటింగ్ పెట్టాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశం

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలుకు సంబంధించి సభలో ఉన్న పది, పదకొండు మంది సభ్యులు అనేక రకాల సమస్యలను వెల్లడిస్తున్నారని, నా నియోజకవర్గానికి కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు 90 శాతం పూర్తయ్యాయని, మరో పది శాతమే మిగిలి ఉన్నాయంటూ సభ్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు అసెంబ్లీ సెషన్ తర్వాత ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలని స్పీకర్ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించగా, ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి రానున్న వారం, పది రోజుల్లో సభ్యులతో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు సభా ముఖంగా వెల్లడించారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?