Rising Global Summit: గ్లోబల్ సమ్మిట్ వేదిక తొలి ఫొటో రిలీజ్
Rising-Global-Summit (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Rising Global Summit: ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ వేదిక తొలి ఫొటో రిలీజ్.. మామూలుగా లేదుగా!

Rising Global Summit: తెలంగాణకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ( Telangana Rising Global Summit) ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలో (Future City) నిర్వహిస్తుండగా, వేదిక నిర్మాణానికి సంబంధించిన తొలి ఫొటో శుక్రవారం నాడు విడుదలైంది. డ్రోన్‌తో తీసిన ఈ ఫొటో అబ్బుర పరుస్తోంది. వేదిక నిర్మాణంలో జరిగిన పురోగతి ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ నగరం సమాయత్తమవుతోందని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో వచ్చే సోమ, మంగళవారాల్లో ప్రపంచ పారిశ్రామిక నాయకులు, ఆవిష్కర్తలు, విజనరీ వ్యక్తులకు ఈ ప్రాంతం స్వాగతం పలుకుతుందని హర్షం వ్యక్తం చేశారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తన ఆశయం, సాంకేతికత, అవకాశాల ద్వారా సాహసోపేతమైన సరికొత్త అభివృద్ధి నమూనాను తెలంగాణ ప్రదర్శిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.

Read Also- SFI Conference: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెలబస్‌లో పెట్టే కుట్ర: ఎస్ఎఫ్ఐ

విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ఇదే వేదికపై ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను కూడా విడుదల చేయనుంది. అంతేకాదు, అభివృద్ధి నమూనాను కూడా ఆవిష్కరించనుంది. క్యూర్ (Core Urban Region Economy), ప్యూర్ (Peri-Urban Region Economy), రేర్ (Rural and Agri Region Economy) వంటి అంశాలపై దృష్టి సారించి సమగ్ర వృద్ధి నమూనాను ప్రదర్శించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

ఇక, ఈ సదస్సులో ప్రపంచ స్థాయీ పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ కంపెనీలుఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈ సదస్సు వేదికగా భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. దేశ, విదేశాల నుంచి 1,000 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Read Also- Mahabubabad District: ఆ గ్రామానికి 25 ఏళ్ల తర్వాత జనరల్ మహిళా రిజర్వేషన్.. అంగన్వాడి టీచర్ కు రాజీనామా.. సర్పంచ్ గా పోటీకి సిద్ధం

పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన లక్ష్యం

ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడిదారుల ఆకర్షించి రాష్ట్రంలోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభుత్వ లక్ష్యంగాఉంది. ఈ లక్ష్యంలో భాగంగా పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలను ఆకర్షించాలని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ మేరకు 2,600 మందికి పైగా ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తయారీ, ఐటీ, ఎమర్జింగ్ టెక్నాలజీలు, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి కీలక రంగాలలో భారీగా ఇన్వెస్ట్‌మెంట్లు రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు