CM Revanth Reddy ( IMAGE credit: swetcha reporter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. బోనస్ ప్రకటించిన సర్కార్ ఒక్కొక్కరికి ఎన్ని లక్షలంటే..?

CM Revanth Reddy: సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) డబుల్ ధమాకా ఇచ్చింది. దసరాతో పాటు దీపావళికి కూడా బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇచ్చారు. సింగరేణి లాభాల్లో 34 శాతం మేర అంటే రూ.819 కోట్లు బోన‌స్‌ గా అందిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ప్రకటించిన బోనస్ వల్ల ప్రతి కార్మికుడికి 1,95,610 రూపాయల చొప్పున ప్రయోజనం చేకూరనుంది. గతేడాది తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేల చొప్పున బోనస్ అందజేయగా, ఈసారి రూ.5,500 చొప్పున బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. సచివాలయంలో మంత్రులతో కలిసి సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

సింగరేణి సంస్థ విస్తరణకు 4,034 కోట్లు

సింగరేణి కార్మికులకు బోనస్ అందించాలన్న అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్, ఇతర మంత్రులు, సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో సీఎం చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పన్నులు పోగా సింగరేణి 6,394 కోట్ల మేరకు లాభాలను గడించిందని వివరించారు. అందులో సింగరేణి సంస్థ విస్తరణకు 4,034 కోట్లు కేటాయించగా మిగిలిన రూ.2360 కోట్లను వివిధ రూపాల్లో కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించడంతో పాటు, అందులో 34 శాతం మేరకు బోనస్ ప్రకటించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో మొత్తంగా దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఈ బోనస్ ప్రకటించగా దీపావళి పండుగ సందర్భంలో బోనస్‌కు సంబంధించి మరో ప్రకటన చేస్తామని తెలియజేశారు. సింగరేణి అభివృద్ధిలో సహకరించిన కార్మిక సంఘాలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.

 Also Read: Illegal Cattle Transport: చర్ల వయా భద్రాచలం టు కురవి .. స్వేచ్ఛ కథనం సోషల్ మీడియాలో వైరల్

సింగరేణి కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేము

తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికుల త్యాగం, శ్రమ, చరిత్ర ఎప్పటికీ మరువలేమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేసి ఆనాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు ప్రత్యేకమైన పాత్ర పోషించారని కొనియాడారు. బొగ్గు గనుల ద్వారా సింగరేణి మొత్తం జాతికే వెలుగులు అందిస్తోందని, దేశంలో పరిశ్రమలు లాభసాటిలో నడుస్తున్నాయంటే కార్మికుల శ్రమ ఎంతో ఉందన్నారు. అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కార్మికులకు లాభాల్లో వాటాలను పంచాలని నిర్ణయించామని సీఎం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం భరించాలి

సింగరేణి సంస్థ కార్పొరేట్ రంగంతో పోటీ పడి తలెత్తుకునేలా భవిష్యత్తు పెట్టుబడులు, ప్రణాళికలతో ముందుకు వెళ్లే విషయంలో కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల కోల్పోయిన రెండు గనులను తిరిగి సింగరేణి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చే విషయంలో అన్ని మార్గాలను అన్వేషిస్తామని స్పష్టంచేశారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రం దాదాపు రూ.7 వేల కోట్ల మేరకు ఆదాయం కోల్పోతోందని తెలిపారు. ఆ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాలరావు, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురామిరెడ్డి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఒక్కొక్కరికి రూ.1,95,610 చొప్పున, అలాగే మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. 41 వేల పర్మినెంట్ సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,95,610 చొప్పున, అలాగే మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు ప్రతి ఒక్కరికీ రూ.5500 బోనస్ గా చెల్లిస్తున్నట్లు వివరించారు. గతంలో ఎప్పుడూ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ చెల్లించిన చరిత్ర లేదన్నారు. బొగ్గుతోపాటు క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి సింగరేణి ప్రవేశిస్తోందని తెలిపారు. సింగరేణి తెలంగాణకు ఆత్మ అని పేర్కొన్నారు. సింగరేణి ఒక్క బొగ్గు మైనింగ్ కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం క్రిటికల్ మినరల్స్ కు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ఆ రంగంలో మైనింగ్ పై దృష్టి పెట్టామన్నారు. కర్ణాటకలో కాపర్, గోల్డ్ మైనింగ్ సంబంధించి టెండర్లు పిలవగా సింగరేణి సంస్థ దక్కించుకుందని భట్టి వివరించారు.

 Also Read: Raasi: స్నానం చేస్తూ చేసే.. అలాంటి సీన్స్ నాకు సెట్ అవ్వవు.. సంచలన కామెంట్స్ చేసిన రాశి

Just In

01

Jayammu Nischayammu Raa: నాకు ఆ డ్యాన్స్‌లేవీ రావ్.. జగపతిబాబు షోలో ప్రభుదేవా!

Sai Pallavi: బికినీలో నేచురల్ బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్!

Telangana: జాతీయ రహదారులు ఎందుకు ఆలస్యమవుతున్నాయ్ ..?

Yedupayala Vana Durga: ఏడుపాయలలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?