Jaishankar Bhupalpally: పాఠశాలలోకి భారీగా చేరిన వరద నీరు..
Jaishankar Bhupalpally ( Image Source: Twitter)
Telangana News

Jaishankar Bhupalpally: పాఠశాలలోకి భారీగా చేరిన వరద నీరు..

 Jaishankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని గొల్ల బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రాంగణంలోకి నీరు చేరడంతో తరగతి గదులు, ఆవరణ బురదమయంగా మారాయి. పాఠశాల ఎదురుగా ఉన్న కల్వర్టులో పేరుకుపోయిన చెత్త, చెదారం, మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read: Gadwal District Collector: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు ఉపాధ్యాయులకు సూచనలు

దీనివల్ల పాఠశాల ముందున్న కుంట నుంచి వరద నీరు నేరుగా పాఠశాలలోకి వస్తుందని, ఈ సమస్య ప్రతి సంవత్సరం పునరావృతమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, పాఠశాలలోకి నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాల వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని, త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Vijay Sethupathi: విజయ్ సేతుపతికి ఆ కోరిక తీరిస్తేనే అమ్మాయిలకు సినిమాలో ఛాన్స్ ఇస్తాడా.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..