Telangana: పోలీసులు వేధిస్తున్నారా? ఇలా చేసి వారికి చెక్ పెట్టండి!
Telangana (Image Source: Twitter)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Telangana: పోలీసులు వేధిస్తున్నారా? ఇలా చేసి వారికి చెక్ పెట్టండి!

Telangana: తెలంగాణలో పోలీసు వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడానికి రాష్ట్రంలో తొలిసారిగా స్టేట్ పోలీస్ కంప్లయింట్ అథారిటీ (ఎస్పీసీఏ) ఏర్పాటు చేశారు. బీఆర్‌కే భవన్‌లోని 8వ అంతస్తులో దీనిని ఆదివారం ప్రారంభించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ బీ. శివశంకర్ రావు ఈ అథారిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎస్పీసీఏలో డీఎస్పీ, ఆపై స్థాయి పోలీసు అధికారులపై ఫిర్యాదులు చేయవచ్చు. ప్రజలు తమకు పోలీసు అధికారుల నుంచి ఏవైనా సమస్యలు ఎదురైతే ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని జస్టిస్ శివశంకర్ రావు తెలిపారు.

Also Read: Tamannaah Bhatia: హీరోయిన్స్ కాస్మెటిక్ సర్జరీలపై ప్రశ్న.. బుర్రబద్దలయ్యే ఆన్సర్ ఇచ్చిన తమన్నా!

ఎస్పీసీఏ ఏర్పాటుతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకం పెరుగుతుందని, ఇది స్వతంత్రంగా పని చేస్తుందని జస్టిస్ బీ. శివశంకర్ రావు పేర్కొన్నారు. ఈ కమిటీలో రిటైర్డ్ ఐపీఎస్ ప్రమోద్ కుమార్, రిటైర్డ్ జడ్జి వర్రె వెంకటేశ్వర్లు, అరవింద్ రెడ్డి, కేవీ రామనర్సింహా రెడ్డి, ఎస్ రాజేందర్​, ఏఐజీ (లా అండ్​ ఆర్డర్​) రమణకుమార్ తదితరులు ఉన్నారు.

Also Read This: Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..