Telangana (Image Source: Twitter)
తెలంగాణ

Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Telangana: అవయవదానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 2024లో దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు సగటున 0.8 అవయవదానాలు జరగగా, తెలంగాణలో ఇదే సంఖ్య 4.88గా నమోదైంది. ఈ ఘనతకు గుర్తింపుగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ తెలంగాణకు అవార్డు ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈ అవార్డును జీవన్‌దాన్ ప్రతినిధులకు అందజేశారు.

Also Read: Excise Raids: బర్త్ డే పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఆరుగురు సాఫ్ట్‌వేర్​ ఉద్యోగుల అరెస్ట్

ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. పేద, ధనిక తేడా లేకుండా అవసరమైన వారందరికీ అవయవాలు అందించేందుకు ఇటీవల ‘తోట యాక్ట్’ను కూడా అనుసరించినట్లు ఆయన తెలిపారు. బ్రెయిన్ డెత్ కేసులలో అవయవాలు వృథా కాకుండా దానం చేయాలని మంత్రి ప్రజలను కోరారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అవయవ మార్పిడి చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 2024లో తెలంగాణలో 188 మంది బ్రెయిన్ డెత్ డోనర్ల నుంచి 725 అవయవాలను సేకరించి, వాటిని ఇతరులకు అమర్చి ప్రాణాలను కాపాడగలిగామని మంత్రి వివరించారు.

Also Read This: Dharmasthala Case: ధర్మస్థల కేసులో ఆసక్తికర పరిణామం.. ప్రత్యక్ష సాక్షికి సిట్ కీలక ఆదేశాలు!

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!