Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా?
Phone Tapping Case ( image credit: twitter)
Telangana News

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్​ కేసులో సిట్ అధికారులు లాజికల్ కంక్లూజన్ తో అదనపు ఛార్జీషీట్​ ను రూపొందించనున్నట్టు తెలిసింది. దీని కోసమే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన దక్కన్ కిచెన్​ హోటల్ యజమాని నందకుమార్​, రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ల నుంచి తాజాగా వాంగ్మూలాలు తీసుకున్నట్టుగా సమాచారం. అయితే, అదనపు ఛార్జీషీట్​ ను కోర్టుకు సమర్పించటానికి ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్​ రావులను కూడా విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది.

క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పరిచిన కొన్నిరోజులకే ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే ఎలక్షన్లలో విజయం దక్కించుకుని హ్యాట్రిక్​ సాధించాలని బీఆర్​ఎస్​ లోని కొందరు కీలక నేతలే అప్పట్లో ఎస్​ఐబీ ఛీఫ్​ గా ఉన్న ప్రభాకర్​ రావు ద్వారా ఈ బాగోతాన్ని నడిపించినట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్​ పై విచారణకు సిట్​ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సిట్ ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్​ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్​ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్​ రావులను అరెస్ట్ చేశారు.

అందరి నోటా

ఈ నలుగురితోపాటు ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్​ రావును సిట్​ అధికారులు గతంలో క్షుణ్నంగా విచారణ జరిపారు. దీంట్లో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్​ రావులు అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్​ గా ఉన్న ప్రభాకర్​ రావు ఆదేశాలతోనే అంతా చేసినట్టు వెల్లడించారు. అయితే, ఫోన్ ట్యాపింగ్​ పై కేసులు నమోదు కాగానే ప్రభాకర్​ రావు అమెరికా పారిపోయాడు. అతని పాస్ పోర్టును రద్దు చేయించి..రెడ్​ కార్నర్ నోటీస్ జారీకి రంగం సిద్ధం చేయటంతో ప్రభాకర్ రావు తప్పనిసరై తిరిగొచ్చారు. అయితే, రావటానికి ముందు సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందారు.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

ఎన్నిమార్లు ప్రశ్నించినా

సుప్రీం కోర్టు కల్పించిన రక్షణతో వచ్చిన ప్రభాకర్​ రావును సిట్​ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించారు. ఎన్నిరకాలుగా విచారణ జరిపినా ప్రభాకర్​ రావు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది వెల్లడించ లేదు. నేనేం చేశానో అంతా నా పై అధికారులకు తెలుసని మాత్రమే సమాధానమిస్తూ వచ్చారు. స్వాధీనం చేసుకున్న పెన్​ డ్రైవ్​ లోని సమాచారాన్ని ముందు పెట్టి ప్రశ్నించినా అదే జవాబు చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి పధ్నాలుగు రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతి తీసుకుని సిట్​ కార్యాలయంలోనే ఉంచి విచారించినా ప్రభాకర్​ రావు పెదవి విప్పలేదు.

లాజికల్ కంక్లూజన్​

ఈ నేపథ్యంలోనే కేసుకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన నందకుమార్ తోపాటు సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ నుంచి తాజాగా స్టేట్​ మెంట్లు తీసుకున్నట్టుగా సమాచారం. దీనిపై ఓ అధికారితో మాట్లాడగా ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఈ ఇద్దరి వాంగ్మూలం కీలకమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్​ మీడియా సమావేశంలోనే నందకుమార్​ మాట్లాడిన ఆడియో టేపులు వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది అప్పటి బీఆర్​ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగానే నందకుమార్​ ఫోన్లను ట్యాప్ చేసిన విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

ఈ ఉదంతంలో నందకుమార్ అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కెప్టెన్​ రోహిత్ రెడ్డి, సింహయాజీ స్వామితో మాట్లాడిన సంభాషణల టేపులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలా చేరాయన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇక, రాజకీయ విశ్లేషకునిగా ఉన్న ఆరా మస్తాన్​ ఫోన్లను కూడా ట్యాప్​ చేసినట్టు ఇప్పటికే విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోనుందన్న దానిపై అంచనాలు వెల్లడించిన ఆరా మస్తాన్ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడిన సంభాషణలను ఫోన్​ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసినట్టు స్పష్టమైందని చెప్పారు. ఈ ఇద్దరి ఉదంతాలను విశ్లేషిస్తే బీఆర్​ఎస్​ ప్రభుత్వం కోసమే ఫోన్​ ట్యాపింగులు జరిగాయన్న విషయం స్పష్టమవుతోందని విశ్లేషించారు. లేనిపక్షంలో నందకుమార్​, ఆరా మస్తాన్ లు మావోయిస్టులు కారని, కనీసం వారి సానుభూతిపరులు కూడా కాదంటూ వారి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుత సీఎం ఫోన్​ తో సహా

అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తదితరుల ఫోన్లను కూడా ట్యాప్​ చేసినట్టుగా సిట్ విచారణలో వెల్లడైందన్నారు. వీరి ఫోన్లను ట్యాప్​ చేయాల్సిన అవసరం ప్రభాకర్ రావుకుగానీ…దీంట్లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావుకుగానీ ఏముంటుందని ప్రశ్నించారు. దీనినిబట్టే అప్పటి బీఆర్​ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల ఆదేశాల మేరకే వందల సంఖ్యలో ఫోన్ల ట్యాపింగ్​ జరిగిందన్నది స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వివరాలతోనే అదనపు ఛార్జీషీట్ ను రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

బీఆర్​ఎస్ సుప్రీం ఆదేశాలతోనే అంతా చేశాం

కేసీఆర్ అయితే, లాజికల్ కంక్లూజన్​ తో అదనపు ఛార్జీషీట్ రూపొందించటానికి ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్​ రావులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. టాస్క్​ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జరిపిన విచారణలో ఆయన నాలుగైదుసార్లు బీఆర్​ఎస్ సుప్రీం ఆదేశాలతోనే అంతా చేశాం అని చెప్పినట్టుగా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇక, హరీశ్​ రావుతో ఎందుకు మాట్లాడారని ప్రభాకర్​ రావును ప్రశ్నించినపుడు మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం ఉందన్న సమాచారంతోనే మాట్లాడినట్టుగా ఆయన వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్​, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వాంగ్మూలాలు సేకరించిన తరువాతే అదనపు ఛార్జీషీట్​ ను తయారు చేయాలని సిట్​ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

Also Read: Phone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!

Just In

01

Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్

Gold Rates: న్యూ ఇయర్ కు ముందే ఈ రేంజ్ లో గోల్డ్ రేట్స్ పెరిగితే తర్వాత ఇక కష్టమేనా?

GHMC: 29న స్టాండింగ్ కమిటీ మీటింగ్.. కమిటీ ముందుకు రానున్న 15 అంశాల అజెండా!

Massive Highway Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 50 వాహనాలు.. 26 మందికి పైగా

Whats App: స్టేటస్ ఎడిటర్‌లో Meta AI టూల్స్ పరీక్షిస్తున్న WhatsApp