MP Kiran Reddy: కేసీఆర్‌పై ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు..
MP Kiran Reddy on KCR (Image Source: X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

MP Kiran Reddy: కృష్ణానదీ జలాలు తాకట్టు

ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ టీఎంసీలు దోపీడీ: ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాయలసీమ రొయ్యలపులుసు తిని, తెలంగాణకు నీటి నష్టం చేసిన దొంగ కేసీఆర్ (KCR) అంటూ ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఏపీ ప్రయోజనాలకు అనుకూలంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ బద్నాం చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్  చూస్తోందన్నారు. కృష్ణా జలాల విషయంలో పాలమూరు, రంగారెడ్డి, బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందన్నారు. జగన్ మాటలతో రాయలసీమ వెళ్లి రొయ్యల పులుసు తిన్న కేసీఆర్ దొంగతనం బయటపడిందన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్‌తో మాట్లాడి కృష్ణా నదీ జలాలను అక్రమంగా తీసుకువెళ్లినట్లు జగన్ చెప్పారని ఎంపీ వివరించారు.

Read Also- Illegal Medical Shops: ఎవరైనా దీనిని తనిఖీ అంటారా?.. చెకింగ్‌కు వెళ్లి అధికారులు చేస్తున్న పనిది

కృష్ణా నదీ జలాలను ఎక్కువ టీఎంసీలు ఏపీకి తరలించడంలో తాను సక్సెస్ అయ్యానని, కానీ చంద్రబాబు ఇప్పుడు ఫెయిల్ అయ్యారని జగన్ చెప్పడంలో అంతర్యాన్ని గమనించాలని ఆయన కోరారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పింది విని నీళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేశారని జగన్ క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రం కంటే కృష్ణా నదిలో ఎక్కువ టీఎంసీల నీళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏపీ దోచుకుందని జగన్ అంగీకరించారని ఎంపీ వివరించారు.

నీళ్ల విషయంలో పోరాటం చేయడంలో బీజేపీ పాత్ర ఉందని బండి సంజయ్ చెప్తున్నారని, అసలు రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ పాత్ర బండి సంజయ్ కు తెలియదన్నారు. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ లో కార్పోరేటర్ గా ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్,శ్రీశైలం,సింగూరు,కడెం లాంటి ప్రాజెక్టులతో పాటు కృష్ణా, గోదావరి బేసిన్ లో ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే కట్టారని గుర్తు చేశారు.రాష్ట్రంలో సాగు,త్రాగు నీటికి వాడుతున్న ప్రతి నీటి చుక్క కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే అని బండి సంజయ్ కు తెలిసినట్లు లేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ళలో బీజేపీ ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించిందన్నారు.

Read Also- Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?