Mahabubabad Shocking (Image Source: Freepic)
తెలంగాణ

Mahabubabad Shocking: ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బతికుండగానే మార్చురీకి పేషెంట్.. రాత్రంతా శవాల మధ్యనే

Mahabubabad Shocking: మహబూబాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బతికున్న ఓ 50 ఏళ్ల వ్యక్తి.. చనిపోయాడని భావించి రాత్రంతా మార్చురీలో ఉంచారు. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ఎల్ది రాజు గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి వచ్చాడు. అయితే రాజు వచ్చేటప్పుడు తన వెంట ఆధార్ కార్డు తెచ్చుకోకపోవడంతో ఆసుపత్రిలోని సిబ్బంది ఆయనకు ఓపి ఇవ్వలేదు. ఆసుపత్రిలో కూడా జాయిన్ చేసుకొని ట్రీట్మెంట్ అందివ్వలేదు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రాజు గత రెండు రోజులుగా ఆసుపత్రిలోనే బిక్కుబిక్కుమంటూ గడిపాడు.

Also Read: Azharuddin: రేపే కేబినెట్‌లోకి అజారుద్దీన్.. టైమ్ కూడా ఫిక్స్.. మంత్రులకు అందిన ఆహ్వానం

ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుఫాన్ ఎఫెక్ట్ తో వర్షం పడుతూనే ఉంది. ఈ సమయంలో ఆసుపత్రిలో స్ట్రెచర్ పై అపస్మారక స్థితిలో పడుకోని ఉన్న రాజును అక్కడ విధులు నిర్వహించే ఆస్పత్రి సిబ్బంది మృతి చెందాడని భావించారు. అతన్ని తీసుకెళ్లి శవాలను భద్రపరిచే మార్చురీలో పెట్టారు. గురువారం ఉదయం మార్చురీ ప్రాంతంలో చెత్త చెదారాన్ని శుభ్రపరిచేందుకు వచ్చిన స్వీపర్ కు మార్చురీలో శబ్దం వినిపించింది. శబ్దం వచ్చిన దగ్గరకు వెళ్లి చూడగా రాజు కదులుతూ కనిపించాడు. దీంతో స్వీపర్.. ఆసుపత్రి వైద్యులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటినా స్పందించి రాజుకు అత్యవసర చికిత్సను అందించారు. ప్రస్తుతం రాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డా. జగదీశ్వర్ తెలిపారు.

Also Read: YS Sharmila: మెుంథాతో ఏపీకి అపార నష్టం.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి.. కేంద్రాన్ని షర్మిల డిమాండ్

Just In

01

Medak Bribe Case: రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన ట్రాన్స్‌కో డీఈ..

Rayaparthi MPDO: ఎంపీడీవోపై టైపిస్ట్ ఆరోపణలు.. గ్రామపంచాయతీ కార్యదర్శుల ప్రెస్‌మీట్.. ఏంటీ వ్యవహారం?

Woman Farmer: చేతులు పట్టుకొని భోరున ఏడ్చిన మహిళా రైతు.. చలించిపోయిన మంత్రి పొన్నం!

Mahakali: ‘మహాకాళి’గా ఎవరంటే.. ఫస్ట్ లుక్ అరాచకం!

Revanth Serious: జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ ఇంజనీర్లపై సీఎం రేవంత్ సీరియస్!.. కారణం ఏంటో తెలుసా?