Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు హేయమైనవి.. కిషన్ రెడ్డి ఫైర్!
Kishan Reddy (imagecredit:twitter)
Telangana News

Kishan Reddy: కూనంనేని వ్యాఖ్యలు హేయమైనవి.. కిషన్ రెడ్డి ఫైర్!

Kishan Reddy: ప్రధాని నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు హేయమైనవని, ఏమాత్రం అర్థంలేనివని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, దేశాభివృద్ధికి అహోరాత్రులు కష్టపడుతూ, అంతర్జాతీయస్థాయిలో భారతదేశ గౌరవాన్ని పెంచుతున్న దార్శనిక నాయకుడిపై ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, అసభ్యమైన వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు కూనంనేని రాజకీయ దివాళాకోరుతనాన్ని బయటపెట్టాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Also Read: Sleeping Pods: రైల్వే గుడ్ న్యూస్.. రైలు వచ్చే వరకు ఎంచక్క అక్కడ పడుకోవచ్చు!

ప్రజాస్వామ్య విలువలపై..

రాజకీయాల్లో హూందాతనం, పరిణితి అవసరమని, అంతేకానీ ప్రధానిపై వ్యక్తిగత దూషణలు, అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి చురకలంటించారు. ప్రజలన్నీ గమనిస్తుంటారనే విషయం గుర్తుంచుకోవాలని కూనంనేనికి సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజలకు ప్రజాస్వామ్య విలువలపై, రాజకీయ వ్యవస్థపై ఏవగింపు కలుగుతోందని ఆయన ఫైరయ్యారు. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు గానూ, కూనంనేని సాంబశివరావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. సభా మర్యాదలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్పీకర్ దీనిపై జోక్యం చేసుకుని మరెవరూ ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయకుండా, సభా మర్యాదలు పాటించేలా చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.

Also Read: Jupally Krishna Rao: కృష్ణాజలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే బీఆర్ఎస్ : మంత్రి జూపల్లి కృష్​ణారావు

Just In

01

Indian Woman Murder: అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువతి దారుణ హత్య.. ఏం జరిగిందంటే?

Vijay Kumar: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు వార్నింగ్..ఈ రూల్స్ పాటించాల్సిందే : అదనపు డీజీపీ విజయ్ కుమార్

Phone Tapping Case: హరీశ్ విచారణకు అనుమతివ్వండి.. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్!

MLC Naveen Rao: ఆరోపణల పేరుతో అవాస్తవాలను నమ్మొద్దు.. సిట్ ఎప్పుడు పిలిచినా సహకరిస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు!

BRS: వాకౌట్ చేసి తప్పు చేశామా? గులాబీ గూటిలో ఒక్కటే చర్చ!