Aarogyasri Scheme: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో చిన్న రిపేర్లు, ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులకు వచ్చే రాజీవ్ ఆరోగ్యశ్రీ క్లెయిమ్స్(Rajiv Arogyasri Claims) మొత్తంలో డిడక్ట్ చేసే 20 శాతాన్ని.. ఇకపై నేరుగా ఆసుపత్రుల బాగోగుల కోసమే వాడాలని గట్టిగా డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఆ 20 శాతం నిధులను ‘రివాల్వింగ్ ఫండ్’ కింద డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖాతాకే నేరుగా రిలీజ్ చేయాలని హెల్త్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు మంగళవారం మెమో జారీ చేశారు. గతంలో ఉన్న జీవో నంబర్ 6ను పక్కాగా అమలు చేస్తూ, ఈ నిధులను కేవలం ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(Infrastructure Development), పరికరాల రిపేర్ల కోసమే వాడాలని స్పష్టం చేశారు.
Also Read: GHMC Council Meeting: మనం రౌడీలమా? ప్రజాప్రతినిధులమా?.. కార్పొరేటర్లపై జీహెచ్ఎంసీ మేయర్ ఆగ్రహం
కొత్త కాలేజీల కోసమే.. నిధుల కష్టాలకు చెక్!
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రులు భారీగా పెరగడంతో డీఎంఈ పరిధి విస్తరించింది. దీంతో ఆయా ఆసుపత్రుల్లో నిర్వహణ భారం పెరిగింది. ఫ్యాన్లు తిరగకపోయినా, స్కానింగ్ మిషన్లు పనిచేయకపోయినా నిధుల కోసం పైకి చూడాల్సిన పనిలేకుండా.. ఈ ఆరోగ్యశ్రీ నిధులను వాడుకునే వెసులుబాటు కల్పించారు. పెరిగిన ఆసుపత్రుల నెట్వర్క్ను దృష్టిలో పెట్టుకుని, క్వాలిటీ సర్వీస్ అందించేందుకే ఈ 20 శాతం నిధులను డీఎంఈకి మళ్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోను ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: Mynampally Rohit Rao: మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

