Rangareddy District: రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి
Rangareddy District (Image Source: Twitter)
Telangana News

Rangareddy District: ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న కారు.. నలుగురు విద్యార్థులు స్పాట్ డెడ్

Rangareddy District: రంగారెడ్డి జిల్లా మెుకిల పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద గురువారం తెల్లవారుజామున ఓ కారు వేగంగా వచ్చి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐసీఎఫ్ఏఐ కళాశాల (ICFAI College)కు చెందిన నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

బర్త్ డే వేడుకల నుంచి వస్తూ..

కారులోని ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదానికి ముందు ఓ బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కోకాపేటలోని ఓ స్నేహితుడి ఇంట్లో జరిగిన వేడుకల్లో వారు పాల్గొన్నారు. అక్కడ తోటి స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఆటలు, పాటలతో హోరెత్తించారు. పార్టీ అనంతరం ఎకో స్పోర్ట్స్ కారులో ఐదుగురు స్నేహితులు తిరుగు ప్రయాణం అయ్యారు. మీర్జాగూడ వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి వేగంగా చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా.. విద్యార్థులు కారులోని ఇరుక్కుపోయిన మృత్యువాత పడ్డారు.

అతి కష్టం మీద..

చెట్టును ఢీకొట్టిన అనంతరం ఇంజిన్ భాగం కారు క్యాబిన్ లోకి చొచ్చుకెళ్లింది. మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న మెుకిల పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన విద్యార్థుల మృతదేహాలను అతికష్టం మీద బయటకు తీశారు. అయితే విద్యార్థుల్లో ఒక యువతి ప్రాణాలతో ఉండటాన్ని గమనించి ఆమెను హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతికి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read: Keesara Police: కీసరలో కత్తుల కలకలం.. దొడ్ల మిల్క్ మేనేజర్‌పై తల్వార్‌తో దాడి చేసిన పాల వ్యాపారి!.

మృతులు వీరే..

ఈ ప్రమాదంలో చనిపోయిన విద్యార్థులను సూర్య తేజ, సుమిత్, శ్రీ నిఖిల్, రోహిత్ గా గుర్తించారు. ఐసీఎఫ్ఏఐ కళాశాలలో సూర్యతేజ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతుండగా.. శ్రీ నిఖిల్, సుమిత్ మూడో ఏడాది విద్యార్థులకు ఉన్నట్లు సమాచారం. మరో విద్యార్థి రోహిత్ మహాత్మా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంజీఐటీ) విద్యార్థిగా పోలీసులు తెలిపారు. మరోవైపు తీవ్ర గాయాలతో బయటపడ్డ యువతిని నక్షత్రగా పోలీసులు గుర్తించారు. ఆమె బీబీఏ మూడో సంతవ్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. చేతికి అందొచ్చిన బిడ్డలు కారు ప్రమాదంలో మరణించడంతో వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Also Read: Phone Tapping Case: ట్యాపింగ్‌ కేసులో సిట్ దారి కరెక్టేనా? మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు!

Just In

01

The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

Hyderabad Police: ఆహార కల్తీని హత్యాయత్నంగానే పరిగణిస్తాం.. వారికి సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుదాం..ఇంకో 8 ఏళ్లు మనదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy: వైఐఐఆర్‌సీ మొద‌టి విడుత‌లో బాలిక‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి!

Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ పాపాలే.. తెలంగాణకు శాపం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు!