CM Revanth Reddy( image credit: twitter)
తెలంగాణ

CM Revanth Reddy: కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!

CM Revanth Reddy: ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే కేసులు పెట్టేందుకు వెనకాడవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. చేసిన మంచి పనిని చెప్పుకోక పోవడం వలనే చిన్న చిన్న సంఘటనలు పెద్దగా ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు జరుగుతున్నాయని సీఎం వెల్లడించారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేసిన ఘటనను ఉదాహరించారు. అందుకే కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను దాచిపెట్టకుండా వెల్లడించాలన్నారు. కలెక్టర్లు కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పాలనా పరంగా తప్పులు జరిగితే, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వాలని అన్నారు. ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేసే వారిని వదిలిపెట్టవద్దని సీఎం నొక్కి చెప్పారు.హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి …మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, దామోదర రాజనర్సింహ, అన్ని జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ అత్యవసర కాన్ఫరెన్స్ లో ప్రధానంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు.

Also Read: Fake Certificates:ఫేక్ సర్టిఫికెట్లపై బల్దియా సీరియస్.. బర్త్, డెత్ సర్టిఫికెట్ల గైడ్ లైన్స్ కఠినతరం!

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేని విధంగా రుతుపవనాలు 15 రోజులు ముందుగా వచ్చాయని, దానికి అనుగుణంగా సన్నద్ధమై ముందస్తు ప్రణాళికతో పని చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశారు.

ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు కూడా నమోదవుతున్నాయని, అన్ని జిల్లాల్లోనూ సీజన్లకు అనుగుణంగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ఇక వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని, రైతులు ఆందోళన చెందారని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ‘యాసంగి లో గతంలో ఎన్నడూ లేనంత ధాన్యాన్ని ప్రభుత్వం ఈసారి కొనుగోలు చేసింది.

గత ఏడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి ఇప్పటికే 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇప్పటికే 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది…’ అని ముఖ్యమంత్రి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించామని, ఈ సీజన్లో ఇప్పటికే రూ.12184 కోట్లు చెల్లించామన్నారు. అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు సమర్ధంగా పని చేయటం వల్లనే ప్రభుత్వం ఈ విజయం సాధించిందని వారిని అభినందించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, మన రైతులు సాధించిన విజయమని ముఖ్యమంత్రి అన్నారు.

Also Read: Water Crisis: గిరిజన తండాలో నీటి కష్టాలు.. పట్టించుకోని అధికారులు!

గత ఏడాదితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని, మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. అన్ని జిల్లాలో విత్తనాలు, ఎరువులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, బఫర్ స్టాక్ ఉందా లేదా చూసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎరువులు విత్తనాలను బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని చెప్పారు. అవసరమైతే కల్తీ విత్తనాల నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు.

గతంలో ధరణి రాష్ట్రంలో రైతుల పాలిట భూతంగా మారిందని, కొత్తగా ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూభారతి చట్టం రైతులకు చుట్టంగా ఉన్నదన్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతంగా అమలవుతున్న భూభారతిని త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, రైతుల సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రమంతటా మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అన్ని జిల్లాల ఇన్ఛార్జీ మంత్రులు రెవిన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూలు, ప్రణాళికను రూపొందించుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నిరుపేదలు ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, కలెక్టర్లు తమ పనితీరును బాధ్యతగా నిర్వర్తించి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

Also Read: Fake IAS officer: వామ్మో ఎంత మోసం.. నకిలీ ఐఏఎస్ గుట్టురట్టు!

మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటు చేయాలని సూచించారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక అధికారి మరియు స్వయం సహాయక సంఘం సభ్యులతో ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మేస్త్రీల ఛార్జీలు, స్టోన్ మెటల్ వంటి ధరలను కట్టడి చేసే బాధ్యతను ఈ కమిటీ చేపడుతుందన్నారు. ఇసుక దందాతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉచిత ఇసుక కూపన్లను సకాలంలో అందించాలని, లబ్ధిదారులకు ఇసుక కొరత లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్ల తయారీకి ఇందిరా మహిళా శక్తి, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. నిరుపేద లబ్దిదారులు ఇబ్బంది పడకుండా తక్కువ ఖర్చుతో ఇండ్ల నిర్మాణం జరిగే కొత్త సాంకేతికతను అనుసరించాలని చెప్పారు. మండల కేంద్రంలో ఉన్న మోడల్ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు చూపించాలని కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని ముఖ్యమంత్రి సూచించారు.జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.

రెయిన్ అలర్ట్..
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రటర్​ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?