Bomb Threat: సీఎంవోకు బాంబు బెదిరింపు.. పోలీసుల టెన్షన్
TG-CMO (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Bomb Threat: సీఎంవోకు బాంబు బెదిరింపు.. పోలీసులను టెన్షన్ పెట్టిస్తున్న ఆకతాయిలు

Bomb Threat: లోక్‌​ భవన్‌కు సైతం బెదిరింపు ఈ-మెయిల్

శంషాబాద్ ఎయిర్​ పోర్టుకు కూడా

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బాంబు బెదిరింపులు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. మంగళవారం నాడు వాసుకి ఖాన్​ అనే పేరుతో ఏకంగా లోక్ భవన్‌కు (రాజ్​ భవన్) బెదిరింపు మెయిల్ వచ్చింది. లోక్​ భవన్‌తోపాటు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చివేయడానికి కుట్ర జరుగుతోందని మెయిల్‌లో పేర్కొన్నారు. ఇక, శంషాబాద్‌లోని ఎయిర్​ పోర్టుకు కూడా మరో బాంబు బెదిరింపు వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టామంటూ అగంతుకులు బెదిరింపు మెయిల్​ పంపించారు. జాస్పర్ పకార్ట్ అనే పేరు మీద న్యూయార్క్​ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టు గుర్తించారు.

ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ భయం జనాలను ఇంకా వెంటాడుతూనే ఉంది. శంషాబాద్ ఎయిర్​ పోర్టుకు ఇటీవలే డజనుకు పైగా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. తాజాగా లోక్​ భవన్‌కు వాసుకి ఖాన్​ పేరిట వచ్చిన మెయిల్​ మరోసారి పోలీసుల్లో తీవ్ర కలవరాన్ని సృష్టించింది.

Read Also- BRS MLA on Kavitha: కుక్కతో పోల్చుతూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ వ్యాఖ్యలు.. తీవ్ర ఆరోపణలు

ఆ మెయిల్‌లో లోక్ భవన్‌తోపాటు సీఎంవోలో పేలుళ్లు జరపటానికి కుట్రలు జరుతున్నాయని అగంతకుడు పేర్కొన్నాడు. వెంటనే వీఐపీలు, ప్రముఖులను భవనాల నుంచి ఖాళీ చేయించాలని రాసుకొచ్చాడు. వెంటనే గవర్నర్ కార్యాలయం అలర్ట్ అయ్యింది. గవర్నర్ ఆఫీస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​ శ్రీనివాస్​ బెదిరింపు మెయిల్‌పై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలియగానే పోలీసు జాగిలాలను తీసుకుని లోక్ భవన్, సీఎంవోలో బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అంగుళం అంగుళం తనిఖీ చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు కనిపించక పోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బెదిరింపు మెయిల్‌పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also- Kamalapuram: ఆ గ్రామం రాష్ట్రానికే ఆదర్శం.. ఊరంతా ఒక్కటయ్యారు.. యూత్ చొరవతో జీపీ ఏకగ్రీవం!

అమెరికా నుంచి బెదిరింపు మెయిల్​…

ఇక, మంగళవారం మరోసారి శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికా వెళ్లే విమానాల్లో బాంబులు పెట్టినట్టుగా అగంతకుడు మెయిల్ లో పేర్కొన్నాడు. వాటిని పేల్చకుండా ఉండాలంటే తనకు మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో విమానాలు టేకాఫ్​ అయిన పది నిమిషాల్లోనే బాంబులను పేల్చి వేస్తానని బెదిరించాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అమెరికా వెళుతున్న అన్ని విమానాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేశారు. దాంతోపాటు ఎయిర్​ పోర్టులో కూడా సోదాలు జరిపారు. దీంట్లో ఎక్కడా పేలుడు పదార్థాలు కనిపించ లేదు. కాగా, ప్రాథమిక విచారణలో జాస్పర్ పకార్ట్​ అనే వ్యక్తి పేర న్యూయార్క్​ నుంచి ఈ మెయిల్ వచ్చినట్టుగా వెల్లడైంది. దీనిపై ఆర్​జీఐఏ పోలీసులు కేసులు నమోదు చేపి దర్యాప్తు ప్రారంభించారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం