Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!
Formula E Race Case( image credit: twitter)
Telangana News

Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!

Formula E Race Case: ఫార్ములా ఈ కార్​ రేస్ కేసు విచారణలో ఏసీబీ (ACB) స్పీడ్ పెంచింది. ఐఏఎస్​ అధికారి (Arvind Kumar) అరవింద్ కుమార్‌కు  నోటీస్​ జారీ చేసింది. జూలై1న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్​ రేస్ (Formula E Race Case)​ నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 50 కోట్ల రూపాయలను (BRS) బీఆర్​ఎస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ (HMDA)  ద్వారా చెల్లించిన విషయం తెలిసిందే. నిజానికి ఈ చెల్లింపులు జరిగినప్పుడు ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో చెల్లింపులు జరపడానికి ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉండగా అలా చేయలేదు. ఇక, 10కోట్లకు మించి విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిపితే రిజర్వ్​ బ్యాంక్​ (Reserve Bank) నుంచి పర్మిషన్ తీసుకోవాలి.

 Also Read: Mini Godowns: ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోదాముల బాధ్యతలు!

అయితే, రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) అనుమతి కూడా తీసుకోకుండానే విదేశీ మారకద్రవ్య రూపంలో చెల్లింపులు జరిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ( Congress Government)  ఏర్పడిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, బీఆర్​ఎస్ (BRS)  వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR) కేటీఆర్​‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు.

దీంట్లో సీనియర్ ఐఏఎస్​ అధికారి (Arvind Kumar) అరవింద్ కుమార్‌ను 2వ నిందితునిగా, హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్‌గా పనిచేసిన బీఎల్​ఎన్​ రెడ్డిని 3వ నిందితుడిగా పేర్కొన్నారు. ఇక, నోటీసులు జారీ చేసి కేటీఆర్​‌ను ఇప్పటి వరకు రెండుసార్లు విచారించారు. దీంట్లో కేటీఆర్ వెల్లడించిన వివరాలపై ఐఏఎస్​ అధికారి అరవింద్ కుమార్‌ను ప్రశ్నించాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు తాజాగా జూలై1న తమ ఎదుట హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం (Arvind Kumar) అరవింద్ కుమార్ విదేశాల్లో ఉండటం గమనార్హం.

 Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. సిట్ దూకుడు!

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం