Mahesh Kumar Goud: కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి పెత్తిపోతల పథకంలో అవినీతి జరగడం నిజమేనని వెల్లడించారు. దమ్ముంటే ఎంక్వైయిరీకి సిద్ధమా? అని పీసీసీ చీఫ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణకు బీఆర్ ఎస్ పార్టీ ఆహ్వానించాలన్నారు.
Also Raed: Hyderabad Development: హైదరాబాద్ డెవలప్ పై సీఎం ప్రత్యేక ఫోకస్.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు!
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై న్యాయస్థానం తీర్పు తమకు అనుకూలంగా ఇచ్చినట్లు, తామంతా నీతిమంతులైనట్లు చెప్పేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి ఈ పథకంపై కోర్టులో కేసు వేశారన్నారు. అన్ని ఆధారాలతో ఆయన న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశారన్నారు. విచారణ కోసం కేటీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
Alos Raed: Notice to Jhansi reddy: కాంగ్రెస్ నేత ఝాన్సీ రెడ్డికి షాక్!..హైకోర్టు షోకాజ్ నోటీసులు.. ఎందుకంటే?