Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు
Kishan Reddy ( image credit: swetcah reporter)
Political News

Kishan Reddy: మోడీతో ఎంపీల మీటింగ్ అంశం లీక్ చేసినోడు మెంటలోడు.. కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం!

Kishan Reddy: ప్రధాని మోడీతో తెలంగాణ బీజేపీ ఎంపీల మీటింగ్ లీక్ చేయడం మంచి పద్ధతి కాదని, లీక్ చేసినోడు మెంటలోడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ప్రధానితో మీటింగ్ వివరాలు ఎవరైనా బయట పెడతారా అంటూ ప్రశ్నించారు. లీక్ చేసిన వారెవరో తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధాని మోడీ ఐకమత్యంతో పనిచేయాలని సూచించారని తెలిపారు.

Also Read: Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అంతర్గత విషయాలు లీక్ చేయడం మంచిది కాదు 

సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలన్నారని, ప్రధానితో సమావేశం మర్యాదపూర్వక భేటీగా చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల ఎంపీలను పిలిచినట్లు తమను కూడా పిలిచారన్నారు. పార్టీని బలోపేతం చేయమని చెప్పారన్నారని వివరించారు. కానీ అంతర్గత విషయాలు లీక్ చేయడం మంచిది కాదని పేర్కొన్నారు. ఓట్ చోరీ సభలో ప్రధానమంత్రిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సరికావని కేంద్ర మంత్రి విమర్శించారు. అనైతికంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయిని తగ్గించేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. రాహుల్ లాంటి నాయకుడు లోక్ సభ ప్రతిపక్ష నేతగా ఉండటం దురదృష్టకరమని చురకలంటించారు.

Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?