Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు
Kishan Reddy ( image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: హైదరాబాద్ కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లోప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్.. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతోందన్నారు. ఈ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

ఈ కల సాకారమవుతుంది

2047 నాటికి దేశం వికసిత భారత్‌గా వెలుగొందాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, అయితే రాష్ట్రాల కీలక సహకారంతోనే ఈ కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పరిశ్రమలను, స్టార్టప్స్ ను, టాలెంట్ ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉందని, త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read: Kishan Reddy: హైదరాబాద్ సంస్థానానికి ఆయన కంటే గొప్ప చేసిందెవరు లేరు: కిషన్ రెడ్డి

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు