Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు
Kishan Reddy ( image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

Kishan Reddy: హైదరాబాద్ కేవలం రాజధాని కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: హైదరాబాద్ కేవలం ఓ రాష్ట్రానికి రాజధాని నగరం కాదని, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లోప్రారంభమైన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్.. ఐటీ హబ్‌గా, ఇన్నొవేషన్ కారిడార్‌గా, ఫార్మాసూటికల్ క్యాపిటల్‌గా, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా వర్ధిల్లుతోందన్నారు. ఈ బ్రాండ్ ఇమేజీని మరింత పెంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

Also Read: Kishan Reddy: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!

ఈ కల సాకారమవుతుంది

2047 నాటికి దేశం వికసిత భారత్‌గా వెలుగొందాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని, అయితే రాష్ట్రాల కీలక సహకారంతోనే ఈ కల సాకారమవుతుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. పరిశ్రమలను, స్టార్టప్స్ ను, టాలెంట్ ను, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఉందని, త్వరలోనే మూడో స్థానానికి ఎగబాకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read: Kishan Reddy: హైదరాబాద్ సంస్థానానికి ఆయన కంటే గొప్ప చేసిందెవరు లేరు: కిషన్ రెడ్డి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?