KTR ( image credit: swetcha reporter)
Politics

KTR: జూబ్లీ బైపోల్‌తో కాంగ్రెస్ పాలన అంతం.. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

KTR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా బీఆర్ఎస్‌లో చేరికలు ఊపందుకోవడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, (KTR) జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని స్పష్టం చేశారు. ఇప్పుడు జరుగుతున్న వరుస చేరికలతో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సందేశం వెళ్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై అందరి చూపు బీఆర్ఎస్ వైపేనని కేటీఆర్ అన్నారు. ఈ జోష్‌లో భాగంగానే, బీజేపీ నేతగా ఉన్న మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కారుకు బుల్డోజర్‌కు మధ్యపోటీ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఖాళీ పాలన

ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ కేవలం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ రియల్ ఎస్టేట్‌ను పూర్తిగా నాశనం చేసిందని, గత ప్రభుత్వ పథకాలన్నింటినీ బంద్ చేసిందని ఫైరయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ.4 వేలు, యువతులకు రూ. 2500, స్కూటీలు, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు వందల రోజులైనా ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు. అంతేకాకుండా, తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు మెడలో చైన్ కూడా లాగేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

500 రోజుల్లో కేసీఆర్ మళ్లీ సీఎం

కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో 500 రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో ఆ పార్టీని ఓడించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గోపీనాథ్‌ను తలుచుకొని మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే, దాన్ని కూడా డ్రామా అంటూ కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డ ఆయన.. అలాంటి కాంగ్రెస్‌కు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read: KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ కు గుణపాఠం చెప్పాలి.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Just In

01

HYDRA: హైడ్రా ప్ర‌జావాణికి విశేష స్పందన.. సోమవారం ఎన్ని ఫిర్యాదులు అందాయో తెలుసా?

Telangana BJP: గతంలో రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. ఈసారీ వర్కౌట్ అయ్యేనా..?

Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!

Stray Dogs Case: వీధి కుక్కల బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట.. ఇకపై ఆ షరతు ఎత్తివేత

Thummala Nageswara Rao: పత్తి సేకరణకు మరీ ఇన్ని ఆంక్షలా?.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ