Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జస్టిస్ పీ.సీ.ఘోష్(P.C. Ghosh) ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇంతకు ముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), హరీష్ రావు(Harish Rao)లు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కొట్టి వేయాలంటూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ సెక్షన్ 8బీ ప్రకారం తమ క్లయింట్లకు నోటీసులు ఇవ్వకుండానే నివేదికను బహిర్గతం చేశారంటూ వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం తనకు కావాల్సినట్టుగా నివేదికను తయారు చేయించినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఇదంతా కేసీఆర్(KCR) ప్రతిష్టను దెబ్బ తీయటానికే చేస్తున్నారని చెప్పారు. అయితే, ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పబ్లిక్ డొమైన్ లో రిపోర్టును పెట్టి ఉంటే దానిని తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
Also Read: BCCI: క్రికెటర్లు, బీసీసీఐ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్!
నేడు అసెంబ్లీలో..
కాగా, ప్రభుత్వం నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్(kaleshwaram Project) పై జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టనుంది. దీనిపై చర్చ జరుపనుంది. ఈ క్రమంలో హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టకుండా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ హైకోర్టు(Highcort)లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో చర్చ జరగటం ఖాయమైంది.
Also Read: Brahmanda Movie Review: బ్రహ్మాండ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?