Gonne Prakash Rao( image credit: twitter)
Politics

Gonne Prakash Rao: మూడోసారి అధికారం కోసమే ఇదంతా.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలి!

Gonne Prakash Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కనుసన్నల్లోనే ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping)  వ్యవహారం నడిచిందని ఆర్టీసీ మాజీ ఛైర్మన్​ గోనె ప్రకాశ్​ రావు (Gonne Prakash Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి అధికారంలోకి రావడానికే ఈ చర్యకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. కేటీఆర్, (KCR)  సంతోశ్​ రావు (Santhosh Ra0) కలిసి కవిత (Kavitha) ఫోన్లను కూడా ట్యాప్​ చేశారన్నారు. ఈ కేసును సీబీఐకి (CBI) అప్పగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అసలు సూత్రధారుల బండారం బట్టబయలు అవుతుందన్నారు. జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్‌లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ఆయన తన వాంగ్మూలాన్ని విచారణ అధికారులకు ఇచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎలాగైనా సరే అధికారాన్ని మూడోసారి చేజిక్కించుకోవాలని కేసీఆర్​ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతోపాటు పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్ (Phone Tapping)   చేయించారన్నారు. చివరకు జర్నలిస్టులు, సినిమా వాళ్లను కూడా వదిలి పెట్టలేదన్నారు. నిజానికి 2015 నుంచే ఫోన్ల ట్యాపింగ్ (Phone Tapping) ​ వ్యవహారం నడుస్తూ వచ్చిందన్నారు. ఓటుకు నోటు వ్యవహారం వెలుగు చూసినప్పుడే కేసీఆర్ ఫోన్లు ట్యాపింగ్  (Phone Tapping) చేస్తున్న విషయం బయట పడిందన్నారు. అప్పట్లో కేసీఆర్ (KCR)​ మీడియా సమావేశం పెట్టి మరీ పైలట్​ రోహిత్​ రెడ్డి, నంద కుమార్​, సింహాయాజీ స్వామి, నంద కుమార్‌లు మాట్లాడిన మాటల ఆడియో టేపులను వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు.

Also Read: Agricultural Workers: 4 నెలలుగా ఎదురు చూస్తున్న ఉపాధి కూలీలు

ట్యాప్​ చేయించక పోతే ఈ ఆడియో టేపులు కేసీఆర్‌కు ఎలా అందాయని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కూడా ఈ బాగోతాన్ని నడిపించారని చెప్పారు. తన ఫోన్​ ట్యాప్​ అయిన విషయం సిట్​ అధికారుల ద్వారా తెలిసిందన్నారు. తాను మాట్లాడిన ఫోన్ నెంబర్లతోపాటు పదిహేను రోజుల డేటాను పోలీసులు చూపించినట్టు చెప్పారు. తన ప్రైవసీకి ఎలా భంగం కలిగిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్​ ఆదేశాలు లేనిదే ఇదంతా జరగదని అన్నారు.

కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు
మాజీ మంత్రి కేటీఆర్​, (KTR)  (Santhosh Ra0) సంతోశ్ రావులు కలిసి కవిత (Kavitha) ఫోన్లను కూడా ట్యాప్​ చేయించారని గోనె ప్రకాశ్ రావు (Gonne Prakash Rao) వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావును (Prabhakar Rao) ఎట్టి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకుని విచారించాలన్నారు. (CBI) సీబీఐకి బదిలీ చేస్తే ఈ వ్యవహారం వెనక ఉన్న పెద్దలు ఎవరన్నది బయట పడుతుందని చెప్పారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా  (Phone Tapping) ​ఫోన్​ ట్యాపింగ్‌‌పై విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

మేమేమైనా టెర్రరిస్టులమా?
వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి వచ్చిన మల్కాజిగిరి కాంగ్రెస్​ నాయకుడు కపిల్ మీడియాతో మాట్లాడుతూ, మేమేమైనా టెర్రరిస్టులమా? మా ఫోన్లు ట్యాప్​ చేశారంటూ వ్యాఖ్యానించారు. సిట్​ అధికారుల ద్వారా తన ఫోన్​ ట్యాప్​ అయినట్టు తెలిసి స్టేట్మెంట్​ ఇవ్వడానికి వచ్చానన్నారు. తాను ఎన్నికల సమయంలో మల్కాజిగిరి, మెదక్​ నియోజకవర్గాల్లో పని చేసినప్పుడు ఫోన్లను ట్యాప్ (Phone Tapping) ​ చేశారన్నారు. బీఆర్​ఎస్ (Brs)​ ప్రభుత్వం అధికారం కోసం ఇలా చేయడం హేయమైన చర్య అని అంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

బాల్క సుమన్​ అనుచరుల ఫోన్లు సైతం
చెన్నూరు నియోజకవర్గం బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేగా పని చేసిన బాల్క సుమన్ ​(Balka Suman) అనుచరుల ఫోన్లను కూడా ట్యాప్​ చేశారని సిట్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. నియోజకవర్గంలోని రామకృష్ణాపూర్​‌కు చెందిన అబ్దుల్​ అజీజ్​, మందమర్రికి చెందిన మహ్మద్​ ముజాహిద్‌‌లు (Balka Suman) బాల్క సుమన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వీరి ఫోన్లు కూడా ట్యాప్​ అయినట్టు వెల్లడి కావడంతో సిట్​ అధికారులు వీరి నుంచి కూడా స్టేట్మెంట్లు తీసుకున్నట్టు తెలిసింది. ఇక, కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Bandi Sanjay) వద్ద పని చేస్తున్న సిబ్బంది, సన్నిహితుల ఫోన్లు కూడా ట్యాప్​ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో వీరి నుంచి కూడా సిట్​ (Sit) అధికారులు వాంగ్మూలాలు తీసుకోనున్నట్టు సమాచారం.

 Also Read: Kavitha: కవితకు మద్దతుపై.. గులాబీ నేతల డైలామా!

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు