Chamala Kiran Kumar: బీజేపీ బీఆర్ఎస్‌ తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు! | Swetchadaily | Telugu Online Daily News
Chamala Kiran Kumar ( IMAGE credit: twitter)
Political News

Chamala Kiran Kumar: బీజేపీ బీఆర్ఎస్‌ తప్పుదోవ పట్టిస్తున్నాయి.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

Chamala Kiran Kumar: రైతుల కష్టాలను పరిశీలించి యూరియా కోసం కేంద్రంపై ఫైట్ చేశామని ఎంపీ చామల కిరణ్​కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar) పేర్కొన్నారు.  ఢిల్లీలో మాట్లాడుతూ వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్(Congress) పలు అంశాలపై ఆందోళనలు చేయగా, ప్రధానంగా యూరియా కోసం ఫైట్ చేశామన్నారు. ‘మకర ద్వారం వద్ద బీహార్ ఓటర్ జాబితాపై ప్రతిరోజు ఆందోళన చేశాం. దేశంలో ఓట్ల చోరీకి చెక్ పెట్టాలని డిమాండ్ చేశాం. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు యూరియా సరఫరా చెయ్యక పోవడం వల్లనే, ముఖ్యమంత్రితో పాటూ మంత్రులు, ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం.

Also Read: Srinivas Goud on Congress: గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగ కూడదనే కుట్ర: శ్రీనివాస్ గౌడ్

 నిధులు ఎందుకు తీసుకురావడం లేదు?’

యూరియా(Urea) పంపిణీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ(BJP) ఎంపీల పరిస్థితి విచిత్రంగా ఉన్నది. రాష్ట్రం పట్ల కనీసం అవగాహన, ఇక్కడి ప్రజల బాధలు అర్థం కావడం లేదు. నమో మోదీ అంటూ తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టేందుకు ఎంపీలు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణకు రావాల్సిన మెట్రో ఫేజ్- 2, ట్రిపుల్ ఆర్, మూసీ ప్రక్షాళనకు నిధులు ఎందుకు తీసుకురావడం లేదు?’ అని చామల ప్రశ్నించారు.

 Also Read: Hydraa: జూబ్లీఎన్‌క్లేవ్‌లో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపు.. పార్కులు కాపాడిన హైడ్రా

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?