revanth reddy and ananya
Politics

Revanth Reddy: సివిల్ టాపర్ అనన్యకు సీఎం సన్మానం

హైదరాబాద్, స్వేచ్ఛ: ఇటీవల ప్రకటించిన యూపీఎస్సీ సివిల్స్ 2023 ఫలితాల్లో పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి కుటుంబసభ్యులతో కలిసి వెళ్లింది అనన్య. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన రేవంత్ రెడ్డి, శాలువా కప్పి సన్మానించారు. అనన్య సొంత ఊరు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం పొన్నగల్. కానీ, చాలా ఏళ్ల క్రితమే మహబూబ్ నగర్ టౌన్‌లో స్థిరపడింది ఆమె కుటుంబం. అనన్య ఇంటర్ పూర్తయ్యాక ఢిల్లీలోని మిరిండా హౌస్ కాలేజీలో బీఏలో చేరింది. 2020 నుంచి పూర్తిస్థాయిలో సివిల్స్ ప్రిపరేషన్స్‌ ప్రారంభించింది.

Also Read: కాంగ్రెస్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు.. ‘బీజేపీని నిలువరించడమే లక్ష్యం’

ఇంటర్ నుంచే ఆమె ఐఏఎస్ వైపు ఆకర్షితురాలైంది. అటువైపుగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఆమె హైదరాబాద్‌లోని నారాయణ ఐఏఎస్ అకాడమీలో చేరింది. ఢిల్లీలో పీజీ చదువుతూనే సివిల్స్ పరీక్షలకు సిద్ధమైంది. సివిల్స్‌లో ఆప్షనల్ సబ్జెక్టుగా ఆంత్రపాలజీని ఆమె ఎంచుకుంది. ఆ తర్వాత ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే ఫస్ట్ ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది.

Just In

01

Bigg Boss Telugu: కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు.. ఫేక్ రిలేషన్స్ పెట్టుకోలేదు.. ప్రోమోలో భరణి వైల్డ్ ఫైర్!

Supreme Court: వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రాలకు నోటీసులు..!

Weather Update: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

Kunamneni Sambasiva Rao: మోదీ పాలనలో దేశ పరిస్థితి తిరోగమనం: ఎమ్మెల్యే కూనంనేని

Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..!