CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రవంత్ రెడ్డి పర్యటన
CM Revanth Reddy ( image CREdit: twitter)
Political News

CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రవంత్ రెడ్డి జిల్లాల పర్యటన

CM Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా సీఎం టూర్ నుంచి ప్రారంభం కానున్నది. డిసెంబర్ 1న ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధి నుంచి సీఎం పర్యటన ప్రారంభం కానుంది. అక్కడ ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’కు సీఎం భూమి పూజ చేయనున్నారు. 2న కొత్తగూడెంలో పర్యటించి, అక్కడ ‘డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’ని ప్రారంభించ నున్నారు. 3న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో కొత్త ఇంజనీరింగ్ కళాశాల భవనాలకు, హెచ్ఏఎం పద్ధ తిలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపనలతో పాటు సీఎం పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

8 నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగే గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కు సీఎం హాజరు

4న ఆదిలాబాద్​లో, 5న వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌‌‌‌‌‌‌‌లో సీఎం పర్యటన ఉంటుంది. ఓరుగల్లు అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ అనుబంధ అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. చివరిగా డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో సీఎం పర్యటిస్తారు. ఫ్లోరై డ్ రహిత నల్గొండలో పట్టణ తాగునీటి సరఫరా, ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిని ప్రస్తావిస్తూ అక్కడి అర్బన్ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రసంగించనున్నారు. ఇక డిసెంబర్ 8 నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగే గ్లోబల్ సమిట్‌‌‌‌‌‌‌‌కు సీఎం హాజరు కానున్నారు.

Also Read:CM Revanth Reddy: రండి.. తరలిరండి తెలంగాణలో పాలుపంచుకోండి: సీఎం రేవంత్ రెడ్డి 

మక్తల్ కు సీఎం రేవంత్ రెడ్డి..  ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి 

నారాయణపేట జిల్లా మక్తల్ కు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని 1000 కోట్ల నిధులతో సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలో చేనున్నారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు…
మక్తల్ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరగబోతుంద న్నారు. సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా 2 : 30 మక్తల్ కు చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మక్తల్ శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి స్వామివారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు.

Also Read: CM Revanth Reddy: చైనా జపాన్‌ల స్థాయి అభివృద్ధే మన టార్గెట్: సీఎం రేవంత్ రెడ్డి

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?