Nirmala Seetharaman
జాతీయం

Nirmala Seetharaman | విభజన తర్వాతే తెలంగాణ అప్పుల పాలైంది : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Seetharaman | తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. మొన్న బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ ఎంపీలు ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రం విభజనకు ముందు మిగులు బడ్జెట్ తో ఉండేది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతనే తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది. దానికి కేంద్రానికి సంబంధం లేదు. తెలంగాణపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు’ అంటూ ఆమె తెలిపారు.

చాలా సార్లు కేంద్రమే తెలంగాణకు అడిగిన దానికన్నా నిధులు ఎక్కువగా కేటాయించినట్టు ఆమె వివరించారు. అయితే నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి సమాధానం ఇవ్వట్లేదని కాంగ్రెస్ ఎంపీలు అసంతృప్తి తెలిపారు. 2025 బడ్జెట్ లో ఏపీకి, బీహార్ కు భారీగా నిధులు కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు మాత్రం పెద్దగా నిధులు కేటాయించలేదు. గతంలో కూడా ఇలాగే జరిగిందని కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు.

Just In

01

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!